ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిజాల పేరుతో పచ్చి అబద్ధాలు వల్లె వేయడాన్ని ఖండిస్తున్నాం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 20, 2022, 11:44 AM

ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు లక్ష రూపాయల చెక్కు పేరుతో జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ రాజకీయం చేస్తున్నారు. ఆయన ఒక రాజకీయ పార్టీని స్థాపించి, రాజకీయ కార్యక్రమం చేయడాన్ని మేము తప్పు పట్టడం లేదు. కానీ నిజాల పేరుతో పచ్చి అబద్ధాలు వల్లె వేయడాన్ని ఖండిస్తున్నాం అని వైయ‌స్ఆర్‌సీపీ సీనియ‌ర్ నాయ‌కులు, మాజీమంత్రి  పేర్ని వెంకట్రామయ్య (నాని)  వ్యాఖ్యానించారు. దేశం మొత్తం మీద, చివరకు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా జగన్‌గారి రైతు సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే, పవన్‌ ఇక్కడ రైతులకు మేలు జరగడం లేదని అసత్యాలు చెబుతున్నారు.  పవన్‌ కళ్యాణ్‌ ప్రశ్నించడం అంటే, విపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా, జగన్‌గారిని విమర్శించడమే. ఎన్ని మంచి పనులు చేస్తున్నా, ఏమీ చేయడం లేదని విమర్శించడమే. ఆనాడు చంద్రబాబు ప్రభుత్వం రైతులకు పంట నష్టం పరిహారం చెల్లించలేదు. విత్తనాల సేకరణ బకాయిలు చెల్లించలేదు. రైతులకు సున్నా వడ్డీ పథకాన్ని కూడా అమలు చేయలేదు కానీ అప్పుడు నోరు మెదపకుండా ఉండటానికి కారణం ఏమిటి అని ఆయన ప్రశ్నించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa