సాగు భారమై, వ్యవసాయం కోసం చేసిన అప్పులు తీర్చే దారిలేక ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డ కౌలు రైతు శ్రీ పోలవరపు వెంకటేశ్వర్లు కుటుంబాన్ని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదివారం ఉదయం పరామర్శించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గం యనమదల గ్రామానికి వెళ్లి ఆ కుటుంబాన్ని ఓదార్చారు. పార్టీ తరఫున లక్ష రూపాయలు ఆర్ధిక సాయం ఆయన భార్య శ్రీమతి పోలవరపు అనూషకు అందజేశారు. ఇద్దరు ఆడబిడ్డలు వైష్ణవి, శ్రీలక్ష్మీ చదువుల బాధ్యత పార్టీ చూసుకుంటుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ , వెంకటేశ్వర్లు ఆత్మహత్యకు గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. వరుసగా పంట నష్టాలు రావడం, బోర్లు వేసిన నీళ్లు పడకపోవడం, సాగు కోసం చేసిన రూ.16 లక్షలు అప్పు తీర్చే మార్గం లేక బలవన్మరణానికి పాల్పడ్డారని చెప్పి కుటుంబ సభ్యులు బోరున విలపించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa