ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అయ్యన్నపాత్రుడు చేసింది కబ్జా కాద...ఇడుపులపాయలో జరిగింది కబ్జా: చంద్రబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 21, 2022, 01:57 AM

అయ్యన్నపాత్రుడు చేసింది కబ్జా కాదని.. ఇడుపులపాయలో 600 ఎకరాల దళితుల భూములు చెరబట్టడం కబ్జా అని ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ పై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఇంటి గోడను రాత్రివేళ కూల్చివేసిన అంశంలో హైకోర్టు చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏం సమాధానం చెబుతారని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. ఏపీలో వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనని.. తప్పు చేసిన అధికారులు మూల్యం చెల్లించుకోక తప్పదని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఇంటి గోడ కూల్చివేతకు నిరసనగా తెలుగు దేశం పార్టీ ‘ఛలో నర్సీపట్నం’ కార్యక్రమానికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురు టీడీపీ నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్ట్‌ చేయడంతో పాటు గృహనిర్బంధాలు చేశారు. దీంతో పోలీసుల తీరుపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


అయ్యన్నపాత్రుడు చేసింది కబ్జా కాదని.. ఇడుపులపాయలో 600 ఎకరాల దళితుల భూములు చెరబట్టడం కబ్జా అని చంద్రబాబు ధ్వజమెత్తారు. నిత్యం టీడీపీ నేతల హౌస్‌ అరెస్ట్‌లు జగన్‌ పిరికితనాన్ని చాటుతున్నాయని దుయ్యబట్టారు. ప్రజల తరఫున గట్టిగా గళం వినిపిస్తున్న టీడీపీ బీసీ నేతలపై కేసులు, అరెస్ట్‌లు, ఇళ్లపై దాడులతో వారిని జగన్‌ వేధించే ప్రయత్నం చేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌ కక్ష సాధింపు కోసం కోర్టు నిబంధనలు ఉల్లంఘిస్తున్న ప్రతి అధికారి భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని వార్నింగ్ ఇచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa