ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గ్రామ సచివాలయాలలో మూడు రోజుల పాటు ప్రత్యేక గ్రివెన్స్ ఏర్పాటు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 21, 2022, 04:03 PM

రైతు సంక్షేమ‌మే సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మ‌ని మంత్రి ఉషాశ్రీ చ‌ర‌ణ్ పేర్కొన్నారు. సోమ‌వారం యాటకల్లులో రైతులకు ప్రభుత్వం రాయితీపై అందిస్తున్న సూక్ష్మ నీటి పరికరాలును మంత్రి ఉషాశ్రీచరణ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రైతు సంక్షేమమే లక్ష్యంగా దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రైతు ముంగిటకే సంక్షేమ పధకాలు అందిస్తున్న ముఖ్యమంత్రి వై.యస్.జగన్ మోహ‌న్ రెడ్డి అని కొనియాడారు.  రాష్ట్రంలో ఏ రైతు నష్టపోకూడదనే ఉద్దేశంతో  పంటల బీమా రాని రైతుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారు సోమ‌వారం నుంచి గ్రామ సచివాలయాలలో మూడు రోజుల పాటు ప్రత్యేక గ్రివెన్స్ ఏర్పాటు చేశార‌ని, రైతులు ఈ అవ‌కాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa