గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా నేడు విజయవాడ 11వ డివిజన్ లోని 201వ సచివాలయ పరిధిలోని విశాల్ మార్ట్ నుండి మొదలై జ్యోతి విద్యాలయం స్ట్రీట్,నూకల రామచంద్రయ్య స్ట్రీట్ ప్రాంతంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ,స్థానిక డివిజన్ ఇంచార్జ్ పర్వతనేని పవన్ (బాబీ) గార్లతో కలిసి, వైసీపీ ఇంచార్జి దేవినేని అవినాష్ ఇంటిఇంటికి వెళ్లి సంక్షేమ పథకాల అమలు తీరును వివరించి, ప్రజల సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది. ప్రజా సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేందుకు ప్రయత్నం జరిగింది. ఆయనతో పాటు ఉన్న సంబంధిత అధికారులకు సమస్య తెలిసిన వెంటనే దానికి సంబంధించిన వివరాలు తెలుసుకొని సమస్యను తీర్చండి అని ఆదేశాలు జారీ చెయ్యడం జరిగింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa