పర్చూరులో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన రైతు భరోసా కార్యక్రమం విజయవంతం కావడం జీర్ణించుకోలేక వైసీపీ మంత్రులు, నాయకులు మొరుగుతున్నారని జనసేన పార్టీ PAC సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ వ్యాఖ్యానించారు. కౌలు రైతు భరోసా యాత్రకు ప్రజల్లో మంచి ఆదరణ ఉండటంతో జగన్ కి భయం పట్టుకొంది అన్నారు. పవన్ కళ్యాణ్ ప్రజల్లోకి వెళ్తుంటే కొన్ని కుక్కలు మొరుగుతున్నాయ్ అని, ఒక ప్రభుత్వం, ఒక వ్యవస్థ చేయవలసిన పనిని పవన్ కళ్యాణ్ చేస్తుంటే వైసీపీ వాళ్లకు చెమటలు పడుతున్నాయనీ చెప్పారు. ఈ కుక్కల్ని ఎక్కువగా మొరగద్దు అని చెప్తున్నా అన్నారు. వైసీపీ వాళ్ళు మాట్లాడితే జగన్ రెడ్డి పులి అని చెప్తున్నారు.. దయచేసి ఆ పులి ని విశాఖ జూలో వదిలిపెట్టాలి అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa