తెలంణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు, ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావుకు సినీ హీరో, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ధన్యవాదాలు తెలిపారు. కారణం బసవతారం హాస్పిటల్ కు సంబంధించి బిల్డింగ్ రెగ్యులైజేషన్ స్కీం కింద సీఎం కేసీఆర్ రూ.6 కోట్లు మాఫీ చేయడంపై బాలకృష్ణ ఇలా ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్లో బసవతారకం కేన్సర్ హాస్పిటల్ సేవలు అందుబాటులోకి వచ్చి 22 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా నిర్వహించిన వార్షికోత్సవ కార్యక్రమానికి ట్రస్ట్ ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ, తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. హరీశ్ రావు ట్రబుల్ షూటర్ అంటూ ప్రశంసించారు. హాస్పిటల్కు బిల్డింగ్ రెగ్యులైజేషన్ స్కీం కింద సీఎం కేసీఆర్ రూ.6 కోట్లు మాఫీ చేశారని బాలయ్య తెలిపారు. పెద్ద మొత్తాన్ని మాఫీ చేసిన సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
బసవతారకం హాస్పిటల్ను ఎన్టీఆర్ మహోన్నత ఆశయంతో స్థాపించారన్న బాలయ్య.. నిమ్స్ తర్వాత ఆరోగ్య శ్రీ ద్వారా ఎక్కువ మంది పేషెంట్లకు చికిత్స అందించే హాస్పిటల్ బసవతారకం హాస్పిటలేనని తెలిపారు. తమ హాస్పిటల్లో ఏడు ఏసీ వార్డులను ఆరోగ్య శ్రీ పేషెంట్ల కోసం కేటాయించామన్నారు. హాస్పిటల్ నిర్వహణకు ఎంతో మంది దాతలు తోడ్పాటు అందిస్తున్నారని బాలయ్య కొనియాడారు.
అనంతరం మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. ఎన్టీఆర్ ఆశయాలను బాలయ్య నెరవేరుస్తున్నారన్నారు. ఎన్టీఆర్ అంటే సీఎం కేసీఆర్ ఎంతో అభిమానమన్నారు. ఈ దారిలో వెళ్తున్నప్పుడు క్యాన్సర్ హాస్పిటల్, ఎన్టీఆర్ గురించి ఎన్నో విషయాలను కేసీఆర్ గుర్తుచేసుకునే వారన్నారు. నైట్ షెల్టర్ ఏర్పాటు చేయాలని కేసీఆర్ సూచించగానే బాలకృష్ణ అమలు చేశారన్నారు. బాలకృష్ణ అడగగానే కేసీఆర్ బీఆర్ఎస్ కింద రూ. 6 కోట్లు మాఫీ చేశారని.. గతంలో ఏ సీఎం కూడా ఇలా చేయలేదని హరీశ్ రావు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకూ రూ.750 కోట్లకుపైగా కేన్సర్ రోగుల కోసం ఖర్చు చేసిందన్నారు. బసవతారకం హాస్పిటల్ 22 ఏళ్లలో 3 లక్షల మంది కేన్సర్ పేషెంట్లకు సేవలందించడం గొప్ప విషయమన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa