పల్నాడు జిల్లా, చిలకలూరిపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ నాయకులూ ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ, సీఎం జగన్ మోహన్ రెడ్డి చేతగాని పనులు, చెత్త పరిపాలనకు ప్రజలు రోడ్డెక్కే పరిస్థితి వచ్చింది. ఏపార్టీ పొత్తు లేకపోయిన 160 సీట్లు గెలిచే సత్తా తెలుగుదేశం పార్టీకి ఉంది. చంద్రబాబు పాలనకోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను జగన్ నెరవేర్చలేకపోయారు. అలివికాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. ఎన్ని హామీలు అమలు చేశారు. హామీల అమలుపై నేను చర్చకు రెడీ. మీరు సిద్ధమా? సవాల్ విసురుతున్నాను.151 మంది M.L.A ల బలమున్నవెన్నెముకలేని C.M.జగన్ మోహన్ రెడ్డి. ఎన్ని జన్మలెత్తినా జగన్ మోహన్ రెడ్డి మరల ముఖ్యమంత్రి కాలేడు. తప్పు చేసిన ఏ ఒక్కడిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వైసిపి నాయకులు, కార్యకర్తలు ఇలాగే ప్రవర్తిస్తే ఒక్కోక్కడి వీపులు పగలడం ఖాయం అని ఆయన హెచ్చరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa