ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమరావతికి వెళ్తే ఎడారికి వెళ్లినట్లే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 01, 2022, 03:01 PM

చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు 2014–2019 మధ్య ఆయన స్పార్థపూరితమైన, అన్యాయమైన, సంకూచిత నిర్ణయాల కారణంగా అన్యాయంగా విభజనకు గురైన రాష్ట్రం అవశేష ఆంధ్రప్రదేశ్‌గా, అవహేళన ఏపీగా పిలువబడిన రాష్ట్రానికి రాజధాని అన్నది లేకుండా చేసారని వైసీపీ సలహా దారు సజ్జల రామకృష్ణ రెడ్డి ఆరోపించారు.  ఎన్టీఆర్‌ జిల్లా గుంటుపల్లిలో నిర్వహించిన వైయస్‌ఆర్‌సీపీ జిల్లా ప్లీనరీ సమావేశంలో సజ్జల రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.... ఇందులో చంద్రబాబు పాత్ర కూడా ఉంది. ఈ రాష్ట్రంలో చంద్రబాబు హయాంలో సకల అరాచకాలకు, దాష్టిక ముఠా పాలనకు, నిరంకుశత్వానికి ఒక చిహ్నంగా చెప్పాలంటే విజయవాడ, చుట్టు ప్రక్కల ప్రాంతాలు కనిపిస్తాయి. ఏ ప్రాంతమైతే తనకు పెట్టని కోటగా చెప్పుకుంటారో..ఆ ప్రాంతమే చంద్రబాబు అన్యాయమైన పాలనకు అద్దం పడుతుంది. లక్ష కోట్లతో రాజధాని నిర్మిస్తానని గొప్పలు చెప్పాడు. ఆ సంగతి పక్కన పెడితే రెండు, మూడు కిలోమీటర్ల ఫ్లై ఓవర్‌ను నిర్మించలేకపోయారు. కారణం ఏంటో చంద్రబాబుకే తెలియాలి. రాజధానికి ఎవరు వచ్చినా విజయవాడ నుంచి వెళ్లాల్సిందే. ఎయిర్‌ పోర్టు దిగగానే మొండిగోడలు పెట్టాడు. ఎటు చూసినా ట్రాఫిక్‌ జాములే. విజయవాడ సిటీ బాగు చేస్తే చంద్రబాబు పాలన బాగుంటుందనే ఆలోచన కూడా ఆయనకు రాలేదు. అమరావతికి వెళ్తే ఎడారికి వెళ్లినట్లే. సరైన రోడ్డు కూడా నిర్మించలేదు. ఐదేళ్ల పాలనలో రెండు మూడు ఫ్లైఓవర్లు కూడా నిర్మించలేకపోయారు. చంద్రబాబు పాలనలో విజయవాడ నగరంలోనే 46 గుళ్లు కూలగొట్టారు. ధర్మ పోరాటం పేరుతో బెంజీ సర్కిల్‌ వద్ద నాలుగు సార్లు పోరాటం చేశారు. ఖాళీ కూర్చీలతో కూర్చొని ప్రజలను ఇబ్బంది పెట్టారు. చంద్రబాబు అరాచకాలకు విజయవాడ అద్దం పడుతుంది. అందుకే మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో అక్రోశం వెల్లగక్కినా ఎవరూ పట్టించుకోలేదు. టీడీపీని స్థానిక సంస్థల ఎన్నికల్లో బుట్టలో పారేశారు అని హెచ్చిపోయారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa