ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మూడు ల‌క్ష‌ల మందికి కొత్త‌గా పింఛ‌న్లు ఇవ్వబోతున్నాం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 01, 2022, 04:19 PM

రాష్ట్ర వ్యాప్తంగా అరవై లక్షల యాభై రెండు వేల మందికి పైగా పెన్షన్ పధకం ద్వారా 1537. 68 కోట్ల రూపాయలను పంపిణి చేస్తున్న ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వమని విజయవాడ తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇంచార్జి దేవినేని అవినాష్ తెలియజేసారు. ఆయన మాట్లాడుతూ... గడప వద్దకే వచ్చి చిరునవ్వుతో అందిస్తున్న వాలంటీర్ దగ్గర లంచాలు లేవు, సిపార్సులు , వివక్ష లేవు అని తెలిపారు. అలానే ఆత్మ గౌరవాన్ని ఎవరి ముందు తాకట్టు పెట్టవలసిన అవసరం లేదు అన్నారు. గంటల తరబడి క్యూ లో నిలబడవలసి అవసరం లేదు , అర్హత ఒక్కటే ప్రామాణికంగా తీసుకొని పిన్షన్ అందిస్తున్న ప్రభుత్వం కేవలం జగన్ ప్రభుత్వం మాత్రమే అని కొనియాడారు. త్వరలో మూడు లక్షల మందికి క్రొత్తగా పెన్షన్ ఇవ్వబోతున్నట్లు ఈ సందర్భంగా ఆయన తెలియజేసారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa