ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తీర్పులను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో ప్రచారమా: జస్టిస్ పర్దీవాలా

national |  Suryaa Desk  | Published : Mon, Jul 04, 2022, 02:12 PM

న్యాయస్థానాల తీర్పుపై కొందరు సోషల్ మీడియాను వేదికగా చేసుకొని  చేస్తున్న వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టారు  జస్టిస్ పర్దీవాలా.  న్యాయమూర్తులు, వారి తీర్పులను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియా వేదికగా వ్యక్తిగత దాడులకు ప్రయత్నించడం ప్రమాదకరమైన పరిణామమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జేబీ పర్దీవాలా వ్యాఖ్యానించారు. రాజ్యాంగం ప్రకారం చట్టాన్ని రక్షించుకోవాలంటే డిజిటల్, సోషల్ మీడియాలను తప్పనిసరిగా నియంత్రించాల్సిన అవసరం ఉందన్నారు.


సోషల్ మీడియా వేదికలపై లక్ష్మణరేఖ దాటుతూ న్యామూర్తులను లక్ష్యంగా చేసుకుని వ్యక్తిగతంగా, దురుద్దేశంతో దాడులకు పాల్పడటం ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు. మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నుపుర్ శర్మ దేశానికి క్షమాపణలు చెప్పాలని సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ జేబీ పర్దీవాలా ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పైవిధంగా స్పందించారు.


ఈరోజు జరిగిన ఒక కార్యక్రమంలో జస్టిస్ పార్దివాలా తన ప్రసంగంలో.. "న్యాయమూర్తులపై వారి తీర్పుల కోసం వ్యక్తిగత దాడులు ప్రమాదకరమైన దృష్టాంతానికి దారితీస్తాయి, ఇక్కడ న్యాయమూర్తులు చట్టం ఏమనుకుంటుందో కాకుండా మీడియా ఏమనుకుంటుందో ఆలోచించాల్సిన ప్రమాదకర పరిస్థితికి దారి తీస్తుంది. ఇది న్యాయవ్యవస్థకు హాని కలిగిస్తుంది. సామాజిక, డిజిటల్ మీడియా ప్రాథమికంగా న్యాయమూర్తులపై నిర్మాణాత్మకమైన విమర్శనాత్మక మూల్యాంకనానికి బదులుగా వ్యక్తిగతీకరించిన అభిప్రాయాలను వ్యక్తీకరించడానికి ఆశ్రయించడం న్యాయ వ్యవస్థకు హాని, దాని గౌరవాన్ని తగ్గిస్తుంది. తీర్పుల పరిష్కారం సోషల్ మీడియాతో లేదు. న్యాయమూర్తులు తమ నాలుక ద్వారా మాట్లాడరు, వారి తీర్పుల ద్వారా మాత్రమే. పూర్తిగా పరిణతి చెందిన లేదా నిర్వచించబడిన ప్రజాస్వామ్యంగా నిర్వచించలేని, పూర్తిగా చట్టపరమైన, రాజ్యాంగపరమైన అంశాలను రాజకీయం చేయడానికి సోషల్ మీడియా తరచుగా ఉపయోగించబడుతోంది' అని వ్యాఖ్యానించారు.


రాజ్యాంగం ప్రకారం చట్టబద్ధమైన పాలనను పరిరక్షించడానికి దేశవ్యాప్తంగా డిజిటల్, సోషల్ మీడియాను నియంత్రించాల్సిన అవసరం ఉందని జస్టిస్ జేపీ పార్దీవాలా అన్నారు. ఇదిలావుంటే నుపుర్ శర్మ వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు ఇటీవల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. నుపుర్ శర్మ నోటి దురుసు కారణంగా దేశం తగలబడుతోందని మండిపడింది. ఈ నేపథ్యంలో మీడియా వేదికగా దేశ ప్రజలకు నుపుర్ శర్మ క్షమాపణలు చెప్పాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆదేశించారు. ఇదిలావుంటే తన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో నుపుర్ శర్మ సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు చెప్పిన విషయం తెలిసిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa