ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తుంగభద్ర జలాశయానికి వరద తాకిడి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jul 07, 2022, 10:10 AM

ఎగువ ప్రాంతాలైన ఆగుంబే, మలేనాడు, హరిహర, శివమొగ్గలో కురిసిన భారీ వర్షాలకు తుంగభద్ర జలాశయానికి 48, 803 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. తుంగభద్ర జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 1, 633 అడుగులు ఉండగా ప్రస్తుతం 1616. 87 అడుగులు ఉంది. జలాశయం పూర్తి స్థాయి నీటి నిల్వ 105. 788 టీఎంసీలు ఉండగా ప్రస్తుత 52. 989 టీఎంసీలు ఉంది. ఇనఫ్లో 48803 క్యూసెక్కులు, అవుట్‌ ఫ్లో 256 క్యూసెక్కులుగా ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa