వైసిపి రాష్ట్ర స్థాయి ప్లీనరీ సమావేశాలను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన శృంగవరపుకోట నియోజకవర్గంలో గల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలకు అలాగే కార్యకర్తలకు ఆహ్వాన పత్రికలను బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూపార్టీని కన్నతల్లిగా భావించే ప్రతి ఒక్కరికీ జూలై 8, 9వ తేదీల్లో నిర్వహించే ప్లీనరీ సమావేశాలు అపురూపమైన పండుగగా నిలుస్తోందని ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు అన్నారు. దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి ఆశయాల సాధన కోసం ఏర్పడిన వైయస్ఆర్ సీపీ అనతి కాలంలోనే ప్రజాధరణ చూరగొని, దేశంలో చరిత్ర సృష్టించే విధంగా అధికారంలోకి వచ్చిందన్నారు.
రానున్న అసెంబ్లీ ఎన్నికలలో మరలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అఖండ మెజారిటీతో గెలిపించే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. నియోజకవర్గం నుండి ప్రతి ఒక్కరూ ప్లీనరీ సమావేశాలకు తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు. సమావేశానికి వచ్చిన ప్రతి ఒక్కరికి రవాణా సౌకర్యాలతో పాటు బస చేసేందుకు అన్ని సౌకర్యాలను కల్పించినట్లు ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ నెక్కల శ్రీదేవి, ఎమ్ పి పి నీలం శెట్టి గోపెమ్మ కొత్తవలస పిఎసియస్ చైర్మన్ గొరపల్లి శివ మండల పార్టీ అధ్యక్షుడు ఒబ్బిన నాయుడు, సీనియర్ నాయకులు మేలాస్త్రి అప్పారావు, వైస్ ఎమ్ పి పి కర్రి శ్రీనివాసరావు, సర్పంచ్ లు, వార్డు మెంబర్లు, ఎమ్ పి టి సి లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa