ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లంచం తీసుకొన్న ఫలితం... పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈడీ అరెస్ట్

national |  Suryaa Desk  | Published : Fri, Jul 08, 2022, 07:47 PM

పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ ను సీబీఐ అధికార్లు అరెస్ట్ చేశారు. ఓ ప్రైవేట్ కంపెనీకి అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలపై పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ బీఎస్ ఝా, టాటా ప్రాజెక్ట్స్ ఎగ్జిక్యూటివ్ వీపీ దేశరాజ్ పాఠక్, అసిస్టెంట్ వీపీ ఆర్‌ఎన్ సింగ్ సహా ఐదుగురు అధికారులను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఝా ప్రస్తుతం ఇటానగర్‌లో విధులు నిర్వహిస్తున్నారు. అక్రమ చెల్లింపులకు ప్రతిఫలంగా ఝా వివిధ ప్రాజెక్టుల్లో ఓ ప్రైవేట్ కంపెనీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని అధికారులు ఆరోపించారు. ఈ మేరకు అధికారులు ఘజియాబాద్, నోయిడా, గురుగ్రామ్ తదితర ప్రాంతాల్లో బుధవారం సోదాలు నిర్వహించారు. ఈ మేరకు గురుగ్రామ్‌లోని బీఎస్‌ ఝా ఇంట్లో రూ.93 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. వివిధ పనుల నిర్వహణకు ప్రైవేట్ కంపెనీల ఎగ్జిక్యూటివ్‌ల నుంచి ఝా లంచాలు తీసుకుంటున్నట్టు సమాచారం అందిందని, అందుకే సీబీఐ అతనిపై నిఘా ఉంచిందని వారు తెలిపారు.


ఏజెన్సీ బృందాలు బుధవారం అక్రమంగా చెల్లింపులు జరుపుతున్న ప్రదేశానికి వెళ్లి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ముడుపులు స్వీక‌రిస్తున్న ఝాను రెడ్ హ్యాండెడ్‌గా సీబీఐ అధికారులు ప‌ట్టుకున్నారు. అరెస్టైన ఆరుగురు నిందితులను గురువారం పంచకుల కోర్టులో హాజరుపరచనున్నట్టు వారు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa