ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పిల్లలను కంటూ...జనాభా పెంచే పనిలో ఎలాన్ మాస్క్

international |  Suryaa Desk  | Published : Fri, Jul 08, 2022, 07:46 PM

ప్రపంచంలో జనాభా తగ్గుతోందని ఇటీవల వ్యాఖ్యానించిన ఎలాన్ మాస్క్ జనాభా తగ్గదలను నివారించే పనిలో పడ్డటుంది. తాజాగా టెస్లా సీఈఓ, బిలియనీర్ ఎలాన్‌ మస్క్‌ (51) తన సంస్థలో పనిచేస్తున్న 36 ఏళ్ల ఓ ఉద్యోగి ద్వారా మరో ఇద్దరు పిల్లలకు తండ్రయినట్లు వార్తలు వైరల్‌గా మారాయి. శివోన్‌ జిలిస్‌ అనే మహిళతో కలిసి 2021 నవంబర్‌లో ఆయన కవల పిల్లలకు జన్మనిచ్చినట్లు బిజినెస్‌ ఇన్‌సైడర్‌ పత్రిక ఓ కథనం ప్రచురించింది. ఎలాన్ మస్క్ స్టార్టప్ సంస్థ ‘న్యూరాలింక్‌’లో శివోన్ జిలిస్ కీలక విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఇక ఎలాన్ మస్క్ ఈ పిల్లలతో కలిసి ఇప్పటివరకు 9 మంది పిల్లలకు తండ్రయ్యారు. కెనడా సింగర్‌ గ్రైమ్స్‌తో ఆయన ఇప్పటికే ఇద్దరు పిల్లల్ని పొందారు. తన మాజీ భార్య జస్టిన్‌ విల్సన్‌తో ఐదుగురు పిల్లలకు తండ్రయ్యారు. గతేడాది డిసెంబరులో ఎలాన్ మస్క్‌, గ్రైమ్స్‌ కలిసి సరోగసీ ద్వారా తమ రెండో బిడ్డకు ఆహ్వానం పలికారు. అయితే, ప్రస్తుతం వీరివురు వేర్వేరుగా ఉంటున్నట్లు సమాచారం.


మస్క్‌, శివోన్ జిలిస్‌ కలిసి ఈ ఏడాది ఏప్రిల్‌‌ 25న పిల్లల పేరు మార్పు అంశంపై కోర్టును ఆశ్రయించారు. తమ పేర్లలోని చివరి పదాన్ని పిల్లల పేర్లలో ఉండేలా మార్పుకునేందుకు అనుమతించాలని న్యాయస్థానాన్ని కోరారు. ఇందుకు సంబంధించి పత్రాల ద్వారా ఎలాన్ మస్క్ మరో ఇద్దరు పిల్లలకు తండ్రైన విషయం వెలుగులోకి వచ్చిందని బిజినెస్‌ ఇన్‌సైడర్‌ పేర్కొంది. పిల్లల పేర్లు మార్చుకునేందుకు కోర్టు ఆమోదం కూడా లభించినట్లు వెల్లడించింది.


శివోన్ జిలిస్‌ ప్రకారం.. మే 2017లో ఆమె కంపెనీలో చేరారు. అదే నెల టెస్లాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగానికి డైరెక్టర్‌గా నియమితులయ్యారు. 2019 వరకు అక్కడే పనిచేశారు. ప్రస్తుతం ఆమె న్యూరాలింక్‌లో ‘ఆపరేషన్స్‌ అండ్‌ స్పెషల్‌ ప్రాజెక్ట్స్‌’ డైరెక్టర్‌గా ఉన్నారు. మస్క్‌ స్థాపించిన మరో సంస్థ OpenAI లోనూ ఆమె బోర్డు సభ్యురాలిగా ఉన్నారు.


ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ట్విటర్‌’ను కొనుగోలు చేసిన మస్క్‌.. శివోన్ జిలిస్‌నే దానికి సీఈఓగా నియమించే అవకాశం ఉన్నట్లు ఆ మధ్య వార్తలొచ్చాయి. అయితే, ఈ వార్తలపై ఇటు మస్క్‌గానీ, ఆయన కార్యాలయం గానీ స్పందించలేదు. ట్విటర్ కొనుగోలు చేసేందుకు మస్క్ ఆ సంస్థతో 44 బిలియన్ డాలర్లకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఎలాన్ మస్క్ ఒక్కసారి ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని ఎంతో వేగంగా అమలు చేస్తారనే పేరుంది. ఎలక్ట్రిక్ కార్ల తయారీకి గుర్తింపు పొందిన టెస్టా కంపెనీ.. కొన్నేళ్ల కిందట దివాలా అంచులకు చేరింది. అప్పులు భారీగా పెరిగిపోయాయి. ఇక మస్క్ సంగతి అయిపోయిందని అందరూ అనుకున్నారు. కానీ, ఆయన కుంగిపోలేదు. పడిపోయిన చోటే తిరిగి లేచారు. టెస్లాను విజయ పథంలో నడిపిస్తున్నారు. టెస్లా ఇప్పుడు దూసుకుపోతోంది. మస్క్ ప్రపంచ కుబేరుడిగా మారడానికి టెస్లా షేర్ల జోరే ప్రధాన కారణం.


నాసా సైతం చేయలేని పనిని మస్క్ చేసి చూపించారు. అంతరిక్ష సంస్థలు ఎప్పుడూ రాకెట్లను తిరిగి ఉపయోగించాలనే ఆలోచన చేయలేదు. ఎలాన్ మస్క్ కొత్తగా ఆలోచించారు. రాకెట్లను తిరిగి ఉపయోగించే టెక్నాలజీని తీసుకొచ్చారు. అదేమంత ఈజీగా జరగలేదు. ఎన్నో వైఫల్యాలను ఎదుర్కొని, చివరికి విజయం సాధించారు. ఆ తర్వాత నాసా నుంచి భారీ డీల్‌ సొంతం చేసుకున్నారు. మస్క్ ఇప్పుడు మార్స్ మీదకు స్టార్ షిప్స్ ద్వారా మనుషులను పంపే ప్రాజెక్ట్‌పై పని చేస్తున్నారు.


మస్క్‌కు ఫిలాసఫీ, సైన్స్ ఫిక్షన్, ఫాంటసీ నావెల్స్ చదవడమంటే ఇష్టం. ఆయన తీసుకునే నిర్ణయాలపై కూడా వీటి ప్రభావం ఉంటుంది. మస్క్‌కు ముందుచూపూ ఎక్కువే. సస్టైనబుల్ ఎనర్జీ, అంతరిక్షం, ట్రాన్సాక్షన్లు లాంటి అనేక విభాగాలపై మస్క్ ఫోకస్ చేశారు. భవిష్యత్‌లో మానవులకు ఏయే రంగాల్లో ఎక్కువగా అవసరం ఉంటుందో వాటిని ముందే గుర్తించి, ఆయా రంగాల్లో పెట్టుబడులు పెడుతున్నారు ఎలాన్ మస్క్.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa