ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వెన్ను చూపకుండా పోరాడే దమ్మున్న నాయకుడు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jul 09, 2022, 03:15 AM

వెన్ను చూపకుండా పోరాడే దమ్మున్న నాయకుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అని మంత్రి ఆర్.కె.రోజా అన్నారు. , వైఎస్ఆర్సిపి జెండా ఎప్పుడూ ఎగురుతూనే ఉంటుంది అంటూ ధీమా వ్యక్తం చేశారు. ఇక ఇదే సమయంలో చంద్రబాబును, తెలుగుదేశం పార్టీ నేతలను టార్గెట్ చేసిన రోజా తెలుగుదేశం పార్టీ ఒక జంబలకడిపంబ పార్టీ అంటూ ఎద్దేవా చేశారు. గుంటూరులోని నాగార్జున యూనివర్సిటీ వద్ద జరుగుతున్న వైసీపీ ప్లీనరీలో మంత్రి రోజా తెలుగుదేశం పార్టీపై, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం జగన్ కటౌట్ ని చూస్తే ప్రతిపక్షాల ఫ్యూజులు ఎగిరిపోతున్నాయి అని మంత్రి రోజా వ్యాఖ్యలు చేశారు. 


జగన్, పవన్ కళ్యాణ్ లు కలిసి కాకుండా విడివిడిగా పోటీ చేయగలరా అంటూ రోజా సవాల్ విసిరారు. జనసేన పార్టీకి 175 స్థానాల్లో అభ్యర్థులు లేరని పేర్కొన్న రోజా తెలుగుదేశం పార్టీకి 60 స్థానాలు అభ్యర్థులు లేరని స్వయంగా లోకేష్ ఒప్పుకున్నారని వెల్లడించారు. పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసిన రోజా పవన్ కళ్యాణ్ రీల్ స్టార్ అయితే జగన్ రియల్ స్టార్ అంటూ వ్యాఖ్యలు చేశారు. 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ను కనీసం అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వలేదని మంత్రి రోజా వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీలో ఆడవాళ్లు తొడ కొడతారని, మగవాళ్లు ఏడుస్తారు అని, అదొక జంబలకడిపంబ పార్టీ అంటూ ఎద్దేవా చేసిన రోజా, చంద్రబాబు పైన నిప్పులు చెరిగారు. వైసీపీ ప్లీనరీలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు తొడ కొడితే చంద్రబాబుకు హార్ట్ఎటాక్ వస్తుందంటూ రోజా సెటైర్లు వేశారు. జగన్మోహన్ రెడ్డిని ఢీ కొట్టడానికి గుంపులుగుంపులుగా కాకుండా, సింగిల్ గా రావాలంటూ రోజా సవాల్ విసిరారు. జగన్మోహన్ రెడ్డి ఆశయం కోసం పోరాడే పులి లాంటి వాడని రోజా కితాబిచ్చారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa