ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశమున్నందున అందుకు తగ్గట్టుగా టీడీపీ పార్టీ నాయకత్వం వ్యూహాలను పదునుపెడుతోంది. ప్రభుత్వం నిర్వహిస్తున్న 'గడప గడపకు మీ ప్రభుత్వం' కార్యక్రమం ముగిసిన తర్వాత ఏ క్షణంలోనైనా ఎన్నికలు జరిగే అవకాశం ఉందని ప్రతిపక్షాలు అంచనా వేస్తున్నాయి. దీంతో పార్టీని మరింత దూకుడుగా ముందుకు తీసుకువెళ్లాలంటే మినీ మహానాడులే అందుకు మార్గమని, అన్ని జిల్లాలను కవర్ చేసినట్లవుతుందని చంద్రబాబు భావిస్తున్నారు. పార్టీ అధికారంలో ఉండి, ఇప్పుడు దూరంగా ఉన్నవారిని దూరంగానే ఉంచుతూ కలిసివచ్చేవారితోనే ముందుకు వెళుతున్నారు. తనంతట తాను గా చంద్రబాబు జోరుగా కార్యక్రమాలకు శ్రీకారం చుడుతుండటంతో నాయకులు, కార్యకర్తలు తండోప తండాలుగా తరలివస్తున్నారు. తర్వాత మినీ మహానాడు ఎక్కడనేది ప్రకటిస్తామని చంద్రబాబు చెప్పారు. ప్రతి ఒక్కటి ఇలాగే ఘనంగా విజయవంతమైతే అధికారంలోకి రావడం సులువని, చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం ఖాయమని ఆ పార్టీ నేతలు సంబరంగా చెబుతున్నారు. వీటిని విజయవంతం చేయడంద్వారా ఎన్నికలను సులువుగా ఎదుర్కోవచ్చనే బాబు వ్యూహం ఫలించే అవకాశం ఉందని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa