నవరత్నాలపై పవన్ వేసిన 9 ప్రశ్నలు చదివాను అని వైసీపీ అధికార ప్రతినిధి సజ్జల రామకృష్ణ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రజలను అడిగితే ఈ ప్రశ్నలకు సమాధానం చెబుతారు. కౌలు రైతులకు సంబంధించి భూ యజమాని వద్ద సమస్య ఉంది. కౌలు రైతులకు ఇవ్వాల్సిన పథకాలన్నీ మా ప్రభుత్వం ఇచ్చింది. కావాలనే చంద్రబాబు అజెండాను పవన్ మోస్తున్నారు. వైయస్ జగన్ ఎప్పుడూ కూడా సింగిల్గానే పోటీ చేస్తారు. ప్రజలకు చెప్పింది చేసి చూపించడం వైయస్ జగన్ నైజం. చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు, మొత్తం కట్టకట్టుకొని వచ్చినా వైయస్ఆర్సీపీ భయపడేది లేదు.రెండేళ్లలో ఉన్న ఎన్నికల్లో ఉత్సాహవంతులను చేసేందుకు ప్రతిఒక్కరిని వైయస్ జగన్ కార్యోణ్ముకులను చేస్తారని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa