నలుగురు గురించి చెప్పాలి. ఆ నలుగురిని 420 గాళ్లు అంటారు అని ప్లీనరీ సందర్భంగా కోడలి నాని మాట్లాడారు. అయన మాట్లాడుతూ... ఒకరు దీనికి రాజ గురువు రామోజీరావు. ఈ రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రిగా ఉండాలి. ఎవరు ప్రధానిగా ఉండాలని నా పేపర్ చదివి ప్రజలు నిర్ణయిస్తారనే పిచ్చి భ్రమలో బతుకుతున్న పిచ్చి రామోజీరావు. రెండో వ్యక్తి ఏబీఎన్ రాధాకృష్ణ సైకిల్ మీద పేపర్ బాయ్గా హైదరాబాద్ వచ్చాడు. సైకిల్ బాయ్గా వచ్చిన దొంగ ఆంధ్రజ్యోతి పేపర్కు యజమాని అయ్యాడు. మూడోవ్యక్తి బీఆర్ నాయుడు. బీహెచ్ఈఎల్లో ఉద్యోగం చేసుకునేవాడు. ప్రపంచంలో ఎవడూ కనిపెట్టలేని మందు కనిపెట్టాడంట.. బట్టతలకు నూనెరాస్తే బొచ్చు వస్తుందని నూనె అమ్మి రూ.600 కోట్లు సంపాదించాడు. బొచ్చు మీద సంపాదించిన బీఆర్ నాయుడు. వీరందరికీ కావాల్సిన వ్యక్తి, వారి జేబులో ఉన్న వ్యక్తి, మడత మంచం చంద్రబాబు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట్రాన్ని దోచుకోవచ్చు. రాష్ట్రంలోని సంపదను లూటీ చేయొచ్చు. ఆంధ్రప్రదేశ్లో కూడా 12 వందల ఎకరాల్లో ఫిల్మ్ సిటీ కట్టొచ్చు.. ఈ రాష్ట్రాన్ని దొంగలించొచ్చు. వేలకోట్లు సంపాదించొచ్చు అని దొంగలముఠాగా ఏర్పడి.. సీఎం వైయస్ జగన్ మీద, ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేస్తున్నారు. ఒక మంచి కార్యక్రమం చేసినా.. దానికి కోడిగుడ్డు మీద ఈకలు పీకుతారు. ఈ 420 గాళ్లకు సీఎం వైయస్ జగన్ భయపడుతారా..? సీఎం వైయస్ జగన్ వరకు ఎందుకు.. 420 గాళ్లకు నేను కూడా భయపడను. నా గడ్డంలోని వెంట్రుకను కూడా పీకలేరు అని ధీమా వ్యక్తపరిచారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa