ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చుట్టుముట్టిన నిరసనకారులు...పారిపోయిన శ్రీలంక దేశాధ్యక్షుడు

international |  Suryaa Desk  | Published : Sat, Jul 09, 2022, 05:23 PM

శ్రీలంక దేశాధ్యక్షుడు రాజపక్ప గోటబాయ నివాసానికి ప్రజలు చుట్టుమట్టడంతో ఆయన పారిపోయారు. సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో ప్రజాగ్రహం నానాటికీ పెరుగుతోంది. ఇప్పటికే మహీంద రాజపక్స ప్రధాని పదవికి రాజీనామా చేశారు. తాజాగా ఆయన సోదరుడు, దేశాధ్యక్షుడు గొటబాయ రాజపక్స తన అధికారిక నివాసం నుంచి పరారయ్యారు. గొటబాయ రాజీనామా చేయాలంటూ ఆందోళనకారులు ఆయన నివాసాన్ని చుట్టుముట్టారు. ఎంతో భద్రత ఉండే ఆయన నివాసంలోకి దూసుకెళ్లారు. దీంతో, ఆయన తన నివాసం నుంచి వెళ్లిపోయారు. గొటబాయ రాజపక్స సురక్షితంగా అక్కడి నుంచి వెళ్లిపోయారని రక్షణశాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి చెప్పారు.   గత కొన్ని నెలలుగా ఆహారం, ఇంధన సమస్యతో శ్రీలంక అట్టుడుకుతోంది. ద్రవ్యోల్బణం అంతకంతకు పెరుగుతోంది. దీంతో దేశ వ్యాప్తంగా ప్రజలు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa