ఏపీలో జగన్ సర్కార్ వైఎస్సార్ వాహనమిత్ర పథకం 2022–23 లబ్ధిదారులకు శుభవార్త అందించే నిర్ణయాన్ని వైసీపీ సర్కార్ తీసుకొంది. ఈనెల 13న ముఖ్యమంత్రి జగన్ చేతుల మీదుగా.. విశాఖలో ఆర్థిక సహాయం అందించనున్నారు. ఈనెల 13న ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్లో కార్యక్రమం నిర్వహిస్తారు. సీఎం జగన్ వైఎస్సార్ వాహనమిత్ర లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేస్తారు. వాహనమిత్ర పథకం కింద అర్హులైన ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ కలిగిన డ్రైవర్లకు ఏటా రూ.10వేలు అందిస్తోంది. ఈ పథకం కింద 2019-20లో 2,36,344 మంది, 2020-21లో 2,73,985 మంది సాయం పొందారు.
ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించేవారు, ఇంటి విద్యుత్తు బిల్లు నెలకు 300 యూనిట్లకుపైగా వినియోగిస్తున్నవారు.. అలాగే మాగాణి 3 ఎకరాలు, మెట్ట 10 ఎకరాలకుపైగా ఉన్నవారు, పట్టణ ప్రాంతాల్లో 1000 చదరపు అడుగులకు పైగా నిర్మిత ప్రాంతం ఉన్నవారు.. వేరొక పథకంలో ప్రయోజనం పొందిన వారు.. ఈ పథకానికి అర్హులు కాదు. ఈ అర్హతలను బట్టి లబ్దిదారుల్ని ఫైనల్ చేస్తారు.
ఈ పథకం కింద ఇప్పటికే లబ్ధిదారులుగా ఉన్నవారు తమ వాహనం పక్కనే ఫొటో దిగాలి. ఆ తర్వాత గ్రామ, వార్డు సచివాలయంలో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కొత్తగా వాహనం కొనుగోలు చేసిన డ్రైవర్లు తమ ఆధార్కార్డు, వైట్ రేషన్ కార్డు, భూమి వివరాలు, ఆదాయ పన్ను, ఇంటి విద్యుత్ వినియోగం, కులం, ఇతర వివరాలకు సంబంధించిన అర్హత పత్రాలతో ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలి. అర్హుల నుంచి వచ్చిన దరఖాస్తులను ఆరు అంచెల్లో పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. అంతేకాదు గత ఆరు నెలల్లో సగటున నెలకు 300 యూనిట్ల కంటే ఎక్కువ వినియోగించిన వారు ఈ పథకానికి అనర్హులు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa