ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దొంగ తననికి ముహుర్తం కావాలా..రాత్రైనా..పగలైన ఒక్కటే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jul 11, 2022, 02:06 PM

ఏదైనా మంచి పనిచేయాలనుకొంటే ముహుర్త బలం చూస్తారు. కానీ దొంగతనానికి ఏంటి మహుర్తం. రాత్రైనా..పగలైనా ఒక్కటే  కదా అని ఓ దొంగ భావించాడు. అలా అనంతపురం జిల్లాలో ఓ దొంగ రెచ్చిపోయాడు. ఉరవకొండలో పట్టపగలే ఆలయంలో చొరబడి అమ్మవారి ఆభరణాలను దొంగతనం చేశాడు. కానీ సీసీ కెమెరాకు అడ్డంగా దొరికిపోయాడు. కొండ పట్టణంలో ప్రఖ్యాత ఉరగాద్రి చౌడేశ్వరి దేవి ఆలయం ఉంది. మధ్యాహ్నం సమయంలో జనాలు లేని సమయాన్ని అదునుగా భావించాడు. అటూ ఇటూ చూసి నేరుగా ఆలయంలోనికి దొంగ చొరబడ్డాడు. తర్వాత గర్భగుడి తాళాలు పగలగొట్టి.. ఏకంగా అమ్మవారి పై ఉన్న ఆభరణాలు మొత్తం దోచుకెళ్లాడు.


దొంగ దాదాపుగా 12.5 కేజీల వెండి ఆభరణాలు చోరీ చేశాడు. అమ్మవారి నగలు మాయం కావడంతో ఆలయ అర్చకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. చోరీ విషయం పై సమాచారం అందుకున్న ఉరవకొండ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దొంగ ఆలయంలో ప్రవేశించి చోరికి పాల్పడిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డ్ అయ్యాయి. సీసీ ఫుటేజ్ ఆధారంగా దొంగను గుర్తించే పనిలో ఉన్నారు పోలీసులు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa