ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ముందస్తు అభ్యర్థుల ప్రకటన టీడీపీకి కలిసొచ్చేనా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jul 11, 2022, 02:07 PM

వచ్చే ఎన్నికలే టార్గెట్ గా అడుగులేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు దూకుడు పెంచారు. వచ్చే ఎన్నికలకు సంబంధించి  ఇఫుడే నిర్ణయాలు తీసుకొంటున్నారు. అదే సందర్భంలో పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టిన అధినేత.. రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు కొనసాగిస్తున్నారు. బాదుడే, బాదుడు.. మిని మహానాడులతో ప్రజల్లోకి వెళుతున్నారు. పనిలో పనిగా టీడీపీ బాస్ కొన్ని నియోజకవర్గాలకు అభ్యర్థుల్ని ఫైనల్ చేసే పనిలో ఉన్నారు. సమస్యలు ఉన్నచోట నియోజకవర్గాలవారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు.. ఎలాంటి ఇబ్బందులు లేనిచోట అభ్యర్థుల్ని పర్కటిస్తున్నారు. అన్నిచోట్లా కాకపోయినా కొన్ని చోట్ల తమ అభ్యర్థి ఎవరో ముందుగానే చెప్పేస్తున్నారు.


గత వారం రాయలసీమలో పర్యటించిన చంద్రబాబు రాజంపేట లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నేతలతో సమీక్ష నిర్వహించారు. ఈసారి రాజంపేట లోక్‌సభ స్థానానికి పార్టీ అభ్యర్థిగా గంటా నరహరి పోటీ చేస్తారని ప్రకటించారు. ఆయన ఇటీవలే చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. చిత్తూరు జిల్లాలో ప్రముఖ పారిశ్రామికవేత్త దివంగత డీకే ఆదికేశవులునాయుడి బంధువు నరహరి. ఆయనను రాజంపేటకు సర్ధుబాటు చేస్తున్నట్లు ప్రకటించారు.


నరహరి బెంగళూరులో వ్యాపారాలు చేస్తున్నారు.. అలాగే 2017-2018లో రాష్ట్రపతి నుంచి ఉత్తమ యువ పారిశ్రామికవేత్తగా అవార్డు అందుకున్నారు. నరహరి దివంగత ఎంపీ డీకే ఆదికేశవులు నాయుడుకు సమీప బంధువు కూడా. డీకే సతీమణి, మాజీ ఎమ్మెల్యే సత్యప్రభ సోదరికి స్వయానా నరహరి అల్లుడు. ఆయన పార్టీలో చేరడంతో రాజంపేట ఎంపీ సీటు ఖాయమనే ప్రచారం జరిగింది. గత ఎన్నికల్లో డీకే సత్యప్రభ రాజంపేట ఎంపీగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఆమె కొన్ని అనారోగ్య కారణాలతో కన్నుమూయగా.. టీడీపీ రాజంపేటలో కొత్త అభ్యర్థిని రంగంలోకి పరిస్థితి ఏర్పడింది. అయితే నరహరి అయితే బావుంటుందని భావించారట. ఆయన కూడా పార్టీలో చేరిన వెంటనే యాక్టివ్ అయ్యారు. నియోజకవర్గంలో జరిగే టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇప్పుడు ఆయన పేరును రాజంపేటకు ఫైనల్ చేశారు.


మరోవైపు కడప లోక్‌సభ స్థానం నుంచి రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డిని బరిలోకి దించుతున్నట్లు చంద్రబాబు చెప్పారు. ఆయన ప్రస్తుతం రాజంపేట ఇంఛార్జ్‌గా ఉన్న సంగతి తెలిసిందే. మరోవైపు రాజంపేట లోక్‌సభ పరిధిలో రెండు అసెంబ్లీ సీట్లకు కూడా అభ్యర్థుల పేర్లను ప్రకటించారు టీడీపీ అధినేత. పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై టీడీపీ అభ్యర్థిగా చల్లా బాబురెడ్డి పోటీ చేస్తారన్నారు. ఇక పీలేరులో పార్టీ అభ్యర్థిగా నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి పేరును ప్రకటించారు. ఇలా కొంతమంది అభ్యర్థుల్ని ఫైనల్ చేశారు చంద్రబాబు. ఇలా మరికొన్ని చోట్ల అభ్యర్థుల్ని ఫైనల్ చేసి గ్రౌండ్ వర్క్ చేసుకునేలా ముందుకు సాగుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa