ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆకలి మంట తిరగబడేలా చేసింది

national |  Suryaa Desk  | Published : Mon, Jul 11, 2022, 04:17 PM

కడుపు మాడితే మనం రగిలిపోతోందా. అదే జరిగింది ఆ కడపుమాడిన విద్యార్థుల విషయంలో. బీహార్‌లోని ఓ పాఠశాలలో విద్యార్థులు తిరుగుబాటు చేశారు. స్కూల్లో మధ్యాహ్నం భోజనం పెట్టడం లేదని, టీచర్లు మసాజ్ చేయమంటున్నారనే కోపంతో ఏకంగా పాఠశాలనే ధ్వంసం చేశారు. కతిహార్‌లోని బార్సోయి బ్లాక్‌లోని అబాద్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బరియాల్ అప్‌గ్రేడ్ మిడిల్ స్కూల్లో ఈ సంఘటన చోటుచేసుకుంది.


మధ్యాహ్న భోజన పథకం అమల్లో తేడాలున్నాయని ఆరోపిస్తూ విద్యార్థులు గొడవకు దిగారు. స్కూల్లో మధ్యాహ్న భోజనం అందించడం లేదని, టీచర్లు పాఠాలు బోధించ‌కుండా మసాజ్ చేయాల‌ని బలవంతం చేశారని విద్యార్థులు ఆరోపణలు చేశారు. ఆగ్రహంతో పాఠశాల ఆస్తులను ధ్వంసం చేశారు. రెచ్చిపోయిన పాఠశాల ఆస్తులను ధ్వంసం చేశారు. అయితే విద్యార్థులను గ్రామస్థులు రెచ్చగొట్టారని స్థానిక మీడియా కథనాలు ప్రసారం చేశాయి. కాగా ఈ ఘటనపై జిల్లా యంత్రాంగం కూడా స్పందించింది. విచారణకు ఆదేశించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


ఈ సంఘటనపై బ్లాక్ ఎడ్యుకేషణ్ ఆఫీసర్ ముంతాజ్ అహ్మద్ స్పందించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గోపైన్ చంద్రతో మాట్లాడారు. ఇది సిగ్గుచేటు విషయమని అన్నారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అయితే బీహర్‌లో గతంలో కూడా ఇలాంటి సంఘటన చోటుచేసుకుంది. 2016లో నలంద జిల్లాలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు రెచ్చిపోయారు. తరగతి గదిల్లోని ఫర్నించర్‌ను పగలగొట్టారు. పాఠశాలల్లో కనీస వసతులు, ఉపాధ్యాయులు లేరనే కారణంతా ఆ విధంగా నిరసన తెలియజేశారు. అప్పుడు ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు వైరల్ అయ్యాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa