ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎందరినో కాపాడు...చివరకు అమరుడయ్యాడు

national |  Suryaa Desk  | Published : Mon, Jul 11, 2022, 04:18 PM

పోలీస్ యూనిఫాం వేసుకొంటే బాధ్యత గుర్తుకొస్తుంది. ఆ అధికారి యూనిఫాం పదవీ ముగిసినా ఆయనలోని కర్తవ్యం మాత్రం చావలేదు. అందుకే రిటైయిడ్ అయినా సరే  ప్రజలకు సేవ చేయడానికి ఓ సాహసమే చేశాడు. ప్రాణాలకు తెగించి ఎందరినో కాపాడి చివరకు తన ప్రాణాలనే కోల్పోయాడు. హిమాలయాల్లో కుంభవృష్టి కురవడంతో అమర్‌నాథ్‌ యాత్ర కోసం వెళ్లిన 16 మంది భక్తులు చనిపోయిన సంగతి తెలిసిందే. వరదలో గల్లంతయిన దాదాపు 40 మంది ఆచూకీ ఇంకా లభ్యం కావాల్సి ఉంది. ఇదిలావుంటే భీకరంగా ప్రవహిస్తో్న్న వరదల్లో కొట్టుకుపోతున్న అనేక మందిని కాపాడిన రిటైర్డ్ పోలీసు అధికారి.. ఆ వరదల్లోనే గల్లంతై ప్రాణాలు కోల్పోయారు. అమర్‌నాథ్ గుహకు సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది.


రాజస్థాన్‌లోని బికనీర్‌కు చెందిన సుశీల్ ఖాత్రి శ్రీగంగానగర్ ట్రాఫిక్ పోలీసు స్టేషన్ ఇంఛార్జీగా పని చేసి ఈ ఏడాది మార్చిలో రిటైరయ్యారు. అమర్‌నాథ్ యాత్ర కోసం జూలై 3న ఆయన శ్రీగంగానగర్ నుంచి బయల్దేరిన 22 బ్యాచ్‌లో ఆయన ఒకరిగా ఉన్నారు. వీరంతా అమర్‌నాథ్ గుహ సమీపంలో టెంట్లలో ఉండగా.. వరద మట్టం క్రమంగా పెరిగి కాసేపట్లోనే వారు ఉన్న టెంట్లను ముంచెత్తింది.


అమరనాథీశ్వరుణ్ని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు వరదలో కొట్టుకుపోవడం గమనించిన ఖాత్రి.. వెంటనే రంగంలోకి దిగి కొందర్ని కాపాడారు. కానీ వరద ఉధృతి ఎక్కువ కావడంతో.. నీటిలో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. ఆయనతోపాటు ఆయన బంధువులు మోహన్‌లాల్ వాద్వా, సునీత వాద్వా సైతం ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. ఈ ముగ్గురి మృతదేహాలను ఆదివారం హెలికాప్టర్‌లో శ్రీనగర్ నుంచి శ్రీగంగానగర్ తరలించారు.


ఇదిలావుంటే వాతావరణం బాగోలేకపోవడంతో.. జమ్మూ నుంచి అమర్‌నాథ్ వెళ్లేందుకు కొత్త బ్యాచ్‌ను నిలిపేశారు. వాతావరణం అనుకూలించకపోవడంతో జమ్మూ నుంచి రెండు బేస్ క్యాంప్‌లకు అమర్‌నాథ్ యాత్రను సస్పెండ్ చేసినట్లు అధికారి ఒకరు పీటీఐ వార్తా సంస్థకు వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa