ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వందేళ్ల చరిత్ర..అత్యధిక బరువున్న భవనాన్ని అలా లేపేశారు

international |  Suryaa Desk  | Published : Mon, Jul 11, 2022, 11:47 PM

చైనా అన్ని రంగాల్లోనూ దూసుకెళ్తోంది. తాజాగా చైనా  ఓ అద్భుతం చేసింది. భవనాలను లిఫ్ట్ సాయంతో పైకి లేపి కదిలించే టెక్నాలజీ గురించి  కొన్ని సందర్బాల్లో విన్నాం. ఈ విషయంలో చైనా మరింత ఆధునికంగా వ్యవహరించింది. పురాతమైన, బరువైన కట్టడాన్ని పునరుద్ధరణ పనుల కోసం సునాయాసంగా తరలించి తన నైపుణ్యాలను చాటుకుంది. చైనా ఆర్థిక రాజధాని షాంఘైలో ఇది చోటు చేసుకుంది.  ఈ భవనానికి వందేళ్లకు పైగా చరిత్ర ఉంది. బరువు 3,800 టన్నులు. టెక్నాలజీ సాయంతో పూర్తిగా పైకి ఎత్తి వేరే చోటుకు తరలించారు. తిరిగి జూలై 8న యథా స్థానంలో ఇంటిని సెట్ చేశారు. పునరుద్ధరణ కార్యక్రమంలో భాగంగా ఇలా చేయాల్సి వచ్చింది. అది పెద్ద, బలమైన నిర్మాణాన్ని తరలించడం షాంఘైలో ఇదే మొదటిసారి. ‘3,800 టన్నుల వందేళ్లనాటి భవనం నిదానంగా కదులుతోంది’అంటూ చైనా ప్రభుత్వ అధికారి జాంగ్ మీఫాంగ్ దీని గురించి ట్వీట్ చేశారు. షాంఘైలో 2020లోనూ 85 ఏళ్లనాటి భవనాన్ని ఇలానే తరలించారు. మన దేశంలో ఇంత భారీ, పురాతన కట్టడాన్ని తరలించిన దాఖలాల్లేవు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa