రాష్ట్రంలో వర్షాలు, వరద పరిస్థితులపై ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎడతెరిపిలేని వర్షాల నేపథ్యంలో సీఎం వైయస్ జగన్ అత్యవసరంగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా గోదావరి ఉధృతి, సహాయక చర్యలపై అధికారులకు దిశానిర్దేశించారు. వీడియో కాన్ఫరెన్స్లో సీఎం వైయస్ జగన్ మాట్లాడుతూ.. గోదావరికి ముందస్తుగానే వరదలు వచ్చాయని, జూలైలోనే 10 లక్షల క్యూసెక్కులకు పైగా వరదలు వచ్చాయన్నారు. రేపు ఉదయానికి వరద పెరిగి 16 లక్షల క్యూసెక్కులకు చేరుకునే అవకాశం ఉందన్నారు.
వరదల వల్ల సంభవించే పరిస్థితులను అడ్డుకునేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. మహారాష్ట్రలో భారీ వర్షాలతో గోదావరికి వరద కొనసాగే అవకాశం ఉందన్నారు. వరద పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని తగిన చర్యలు తీసుకోవాలన్నారు. కూనవరం, చింతూరుల్లో 2 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, వీఆర్పురం, కూనవరం, అమలాపురం, వేలేరుపాడులో 4 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. కంట్రోల్ రూమ్లు సమర్థవంతంగా పనిచేయాలని అధికారులను ఆదేశించారు. అవసరమైన చోట వరద సహాయక శిబిరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. మంచి ఆహారం, తాగునీరు, ఇతర సౌకర్యాల ఏర్పాట్లలో ఎలాంటి ఇబ్బంది ఉండకూడదన్నారు. సహాయక శిబిరాల నుంచి ఇళ్లకు వెళ్లేటప్పుడు ప్రతి కుటుంబానికి రూ.2 వేలు తక్షణసాయంగా అందించాలని, ఆ సాయం వారికి ఉపయోగపడుతుందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa