జగన్ సీబీఐ కేసులకు భయపడి రాష్ట్రపతి ఎన్నికలకు మద్దతు ఇస్తున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆరోపించారు. జగన్ 8 లక్షల కోట్లు అప్పు చేశారని, ఒక్క కంపెనీని తీసుకురాలేదన్నారు. ఇటు కేసీఆర్ పైనా కేఏ పాల్ సంచలన కామెంట్స్ చేశారు. కేసీఆర్ బీజేపీకి బీ టీం అని విమర్శలు గుప్పించారు. బండి సంజయ్ ప్రధాని మోదీని దేవుడు అంటున్నారని, బండికి దేవుడు ఎలా ఉంటాడో తెలుసా అని కేఏ పాల్ ప్రశ్నించారు. ఇటీవలే కేసీఆర్పై సీబీఐకి ఫిర్యాదు చేసిన పాల్, తాజాగా మౌనదీక్ష నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
ఇదిలావుంటే కేఏ పాల్ మరోసారి ఇంట్రస్టింగ్ స్టెప్ తీసుకున్నారు. ఏకంగా ఢిల్లీలో దీక్ష చేయడానికి ప్లాన్ చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాలకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులను విడుదల చేయాలని దీక్షకు పూనుకున్న పాల్.. తన మౌన దీక్షకు హాజరవ్వాలని ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్ కు ఇన్విటేషన్ పంపారు.
తెలంగాణకు రావాల్సిన నిధులను కేంద్రం వెంటనే విడుదల చేయాలని కేఏ పాల్ డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రానికి నిధులు, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు. వీటిని సాధించడానికి, శనివారం రాజ్ ఘాట్ లో మౌన దీక్ష చేస్తానని కేఏ పాల్ ప్రకటించారు. ఈ కార్యక్రమానికి కేసీఆర్, జగన్ సహా, తెలుగు రాష్ట్రాల్లోని వివిధ పార్టీలకు చెందిన నేతలను ఆహ్వానిస్తున్నానని చెప్పారు. తెలుగు రాష్ట్రాల హక్కుల కోసం పోరాటం చేద్దామని పాల్ పిలుపునిచ్చారు. తెలుగు రాష్ట్రాల సత్తా కేంద్రానికి చూపిద్దామన్నారు.
అటు, తెలుగు రాష్ట్రాల్లో కేఏ పాల్ పొలిటికల్ టూర్ కు కూడా ప్లాన్ చేసుకుంటున్నారు. ఏపీ, తెలంగాణలో రోడ్షోలు, భారీ బహిరంగ సభలు నిర్వహించాలని ప్రణాళిక రూపొందించుకుంటున్నారు. 'పాల్ రావాలి-పాలన మారాలి' నినాదంతో తాను క్షేత్ర స్థాయిలో పర్యటిస్తానని గతంలోనే పాల్ ప్రకటించారు. శ్రీకాకుళం, కాకినాడ, రాజమండ్రి, ఏలూరు, గుంటూరు, ఒంగోలు, చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో పర్యటించడానికి కేఏ పాల్ ఏర్పాట్లు చేసుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa