విశాఖలో వైయస్ఆర్ వాహన మిత్ర పథకం వరుసగా నాల్గవ సంవత్సరం ప్రారంభోత్సవంలో మంత్రి విశ్వరూప్ పాల్గొని మాట్లాడారు. ‘వైయస్ జగన్ పాదయాత్రలో ఆటో సోదరులంతా కలిసివచ్చి అడుగులో అడుగు వేశారు. అధికారంలోకి వస్తే ఆటో సోదరుల జీవితాలను మారుస్తానని సీఎం వైయస్ జగన్ చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం తొలి సంవత్సరమే.. నాలుగు నెలల ముందుగానే వాహన మిత్ర కార్యక్రమాన్ని తీసుకువచ్చి డ్రైవర్ల జీవితాల్లో వెలుగులు నింపారు. వాహన మిత్ర ద్వారా డ్రైవర్లను, అమ్మ ఒడి, విద్యా కానుక ద్వారా, జగనన్న వసతి దీవెన, విద్యా దీవెన వంటి పథకాలతో ఆ కుటుంబాలకు తోడుగా నిలుస్తుంది. నిరుపేద పిల్లలు ఉన్నత చదువులు చదువుకోవడానికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేస్తుంది. బహుశా భారతదేశంలో ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా ఇన్ని వినూత్న కార్యక్రమాలు అమలు చేసిన దాఖలాలు లేవు. సీఎం వైయస్ జగన్ ప్రభుత్వాన్ని చూసి అనేక రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa