ఏపీకి సంబంధించి విభజన చట్టంను కేంద్ర ప్రభుత్వం అమలు చేయడంలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రముఖ క్రైస్తవ మత బోధకుడు, ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ దేశ రాజధాని ఢిల్లీలోని రాజ్ ఘాట్లో దీక్షకు దిగారు. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు మౌన దీక్షకు దిగిన ఆయన 3 గంటల పాటు తన దీక్ష కొనసాగుతుందని ప్రకటించారు. ఏపీ విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలన్న ప్రధాన డిమాండ్తోనే తాను ఈ దీక్షను చేపట్టినట్లు ఆయన ప్రకటించారు. గడచిన 8 ఏళ్లుగా విభజన చట్టంలోని హామీలను అమలు చేయకుండా కేంద్రం, ప్రధాని నరేంద్ర మోదీ తొక్కిపెట్టారని ఆయన ఆరోపించారు.
రాష్ట్ర విభజన చట్టం హామీల అమలు కోసం వచ్చే బుధవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనకు దిగనున్నట్లు కేఏ పాల్ ప్రకటించారు. అప్పటికీ విభజన చట్టం హామీలు అమలు కాకుంటే ఆగస్టు 15 నుంచి తర్వాత ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని ఆయన హెచ్చరించారు. తెలుగు ప్రజలు సత్తా చూపకపోతే విభజన చట్టం హామీలు అమలు కావన్న పాల్.. ఈ కారణంగానే తాను దీక్షలకు దిగుతున్నట్లు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa