ఉప రాష్ట్రపతిగా తిరిగి ఎన్నికయ్యేందుకు వెంకయ్య నాయడు అవకాశాలకు తెరపడిపోయిందని కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేశ్ వ్యాఖ్యానించారు. వెరసి వెంకయ్య చమత్కారం, చాతుర్యాన్ని మిస్ అవుతున్నామని ఆయన పేర్కొన్నారు. ఉపరాష్ట్రపతిగా కొనసాగుతున్న తెలుగు నేత ముప్పవరపు వెంకయ్యనాయుడిపై కేంద్ర మాజీ మంత్రి, ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్ శనివారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ఓ ఆసక్తికర ట్వీట్ను పోస్ట్ చేశారు. చాలా సందర్భాల్లో విపక్షాలు ఆందోళనకు దిగేలా వెంకయ్య వైఖరి ఉన్నా... చివరకు ఆయన ఓ మంచి మనిషిగానే పదవి నుంచి దిగిపోతున్నారని కూడా ఆయన వ్యాఖ్యానించారు. పదవి నుంచి విరమణ తీసుకుంటున్నా... వెంకయ్య అలసిపోడని నాకు తెలుసు అంటూ జైరాం రమేశ్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
ఇదిలావుంటే భారత ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి అధికార ఎన్టీఏ అభ్యర్థిగా పశ్చిమ బెంగాల్ గవర్నర్గా పనిచేస్తున్న జగదీప్ ధన్ఖడ్ ను ఎంపిక చేస్తూ బీజేపీ కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఫలితంగా ఉపరాష్ట్రపతిగా వెంకయ్యకు మరో అవకాశం లేదని తేలిపోయింది. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ జైరాం రమేశ్ ట్వీట్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa