అఖిలపక్ష సమావేశానికి ఇదివరకటి మాదిరిగానే ప్రధాని నరేంద్ర మోదీ డుమ్మా కొట్టారని ఇది అన్పార్లమెంటరీనేనని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్ వ్యాఖ్యానించారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో ఆదివారం పార్లమెంటు ఆవరణలో అధికార కూటమి ఎన్డీఏ అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గైర్హాజరయ్యారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు జైరాం రమేశ్ ఓ ట్వీట్ను పోస్ట్ చేశారు. ఇదిలా ఉంటే... ఈ సమావేశానికి తెలుగు రాష్ట్రాల నుంచి అన్ని పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. ఏపీలో అధికార పార్టీ వైసీపీ నుంచి ఆ విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి హాజరు కాగా... విపక్ష టీడీపీ నుంచి కనకమేడల రవీంద్ర కుమార్, గల్లా జయదేవ్లు హాజరయ్యారు. తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ నుంచి కె.కేశవరావు, నామా నాగేశ్వరరావులు హాజరయ్యారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa