గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం విజయవాడ పరిధిలో వైసీపీ ఇంచార్జి దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో 16వ డివిజన్లో 76వ సచివాలయ పరిధిలోని బాలాజీ నగర్ ప్రాంతంలో జరిగింది. ఈ క్రమంలో ఇంటి ఇంటికి వెళ్లి వైసీపీ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు,చేస్తున్న అభివృద్ధి గురుంచి వివరిస్తూ,స్థానిక సమస్యలను అడిగి తెలుసుకుని వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని భరోసా ఇవ్వడం జరిగింది. స్థానిక వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ శ్రీమతి ఉమ్మడిశెట్టి రాధిక చొరవతో దాదాపు రూ.8,32,000/- ప్రభుత్వ నిధులతో నిర్మించిన సిరిపురం రాజారామ్ స్ట్రీట్ రోడ్డు ను ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa