ప్రభుత్వం తన బాధ్యతను నెరవేర్చడంలో విఫలమైనప్పుడు ప్రతిపక్షం చూస్తూ కూర్చోదు అని టీడీపీ నాయకులూ చింతమనేని ప్రభాకర్ తెలియజేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలుగుదేశం పార్టీ అంటే అధికారంలో ఉన్నా లేకున్నా ఎప్పుడూ ప్రజల పక్షమే. ప్రభుత్వ సహాయం అందడం లేదంటూ తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు మొరపెట్టుకున్నారు వరద బాధితులు. వెంటనే స్పందించిన చింతమనేని ఈరోజు ఉదయం వేలేరుపాడు మండలంలో 1600 కుటుంబాలకు పాల ప్యాకెట్లు పంపిణీ చేసారు. రేపటికి మరో 10,000 కుటుంబాలకు పాల ప్యాకెట్ల పంపిణీకి ఏర్పాట్లు చేసుకున్నారు. 15 టన్నుల కూరగాయల్ని స్వయంగా కొనుగోలు చేసి వరద బాధితులకు అందజేస్తున్నారు. కుక్కునూరు మండలంలోని దాచారం, బెస్త గూడెం పునరావాస కేంద్రాల వద్ద వరద బాధితులకు భోజన ఏర్పాట్లు చేసి స్వయంగా వడ్డించారు. ముంపు ప్రాంతాల్లో కనిపించిన ప్రతి అధికారికి చేతులెత్తి నమస్కరిస్తూ... తనదైన శైలిలో ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa