మెగాస్టార్ చిరంజీవిపై తాను చేసిన వ్యాఖ్యల్నివెనక్కి తీసుకుంటున్నాను అని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ వెల్లడించారు. తాను చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నానని.. మెగా అభిమానులు ఈ వ్యాఖ్యల్ని మర్చిపోవాలని ఆయన కోరారు. తాను వాడిన పదాన్ని భాషా దోషంగా పరిగణిస్తున్నానని.. ఇక ఆ వివాదం జోలికి వెళ్లొద్దన్నారు. చిరంజీవి అభిమానులు, కాపు నాడు సభ్యులు కలిసి వరద బాధితులకు సాయం చేసేందుకు ముందుకు రావాలన్నారు. తాను వివాదాల జోలికి వెళ్లనని.. తన వ్యాఖ్యల్ని సమర్థించుకోలేదన్నారు. చిరంజీవి రాజకీయ నేతగా ఉన్నారని.. రాజకీయాల్లో విమర్శలను స్పోర్టివ్గా తీసుకోవాలి అన్నారు. కానీ తాను రాజకీయేత భాషగా ఆ పదం వాడానని.. భాషా దోషంగా భావించాలని కోరారు.
రెండు రోజుల క్రితం నారాయణ చిరంజీవి, పవన్ కళ్యాణ్ టార్గెట్గా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ హాజరైన అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ వేదిక పైకి.. అల్లూరి సీతారామరాజుగా నటించిన కృష్ణను పిలిస్తే బావుండేది తన అభిప్రాయాన్ని చెప్పారు. అలాంటిది రాజకీయాల్లో రంగులు మార్చే చిరంజీవిని ఎక్కించటం తగదని.. చిల్లర బేరగాడు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ ల్యాండ్ మైన్, ఎవరి మీద పేలుతాడో తెలియని విధంగా రాజకీయం చేస్తున్నారని.. రోడ్ల దుస్థితిపై జనసేన పార్టీ చేస్తున్న నిరసనలను స్వాగతించిన సంగతి తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa