రాష్ట్ర బ్రాహ్మణ సంఘటన రాష్ట్ర అధ్యక్షులు,నరసరావుపేట మాజీ మున్సిపల్ కో-ఆప్షన్ మెంబెర్ కోట ప్రసాద్ గుండెపోటుతో బుధవారం మృతి చెందారు. విషయం తెలిసి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు,రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు,జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ సంతాపం ప్రకటించారు. వేములపల్లి వెంకట నరసయ్య,నల్లపాటి రాము,కడియాల రమేష్,కొల్లి బ్రహ్మయ్య,పులిమి వెంకట రామిరెడ్డి మరియు టీడీపీ నాయకులు,కార్యకర్తలు తో కలిసి నరసరావుపేట టీడీపీ ఇంచార్జి చదలవాడ అరవింద్ బాబు భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కోట ప్రసాద్ మృతి పార్టీకేగాక వ్యక్తిగతంగా తీరని లోటు.కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటాను. నరసరావుపేట పట్టణంలోని స్థానిక ప్రకాష్ నగర్ నుండి అంత్యక్రియలు కొద్దిసేపటి క్రితమే ప్రారంభమయ్యాయి.అంతిమయాత్రలో పాల్గొని పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది అని తెలియజేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa