ఎమ్మెల్యేకు వచ్చిన బెదరింపుల లేఖ అంశం కేరళలో రాజకీయంగా దుమారంరేపుతోంది. కేరళ (ఎమ్మెల్యేకు బెదిరింపు లేఖ వచ్చింది. పయ్యన్నూరు కామ్రేడ్స్ అనే గ్రూప్ నుంచి చంపేస్తామని ఎమ్మెల్యే రెమాకు లేఖ అందింది. రాష్ట్ర మాజీ మంత్రి, సీపీఐ(ఎం) శాసన సభ్యుడు మణి.. రెమాపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పారు. అలా చెప్పిన ఒక్కరోజు తర్వాత ఆమెకు బెదిరింపు కాల్ రావడం గమనార్హం. బెదిరింపు లేఖ అందుకున్న తర్వాత రెమా శుక్రవారం రాష్ట్ర పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఇలాంటి బెదిరింపులకు తాను కానీ తన పార్టీ కానీ లొంగబోమని రెమా అన్నారు.
కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ మద్దతుతో రెమా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. రెమా సీపీఎం మాజీ నాయకుడు చంద్రశేఖరన్ భార్య. అయితే 2012లో కోజికోడ్లోని తన ఇంటి దగ్గర కొంతమంది దుండగులు చంద్రశేఖరన్ను 51 సార్లు దారుణంగా నరికి చంపారు. 2008లో చంద్రశేఖరన్ పార్టీని వీడి సొంతంగా పార్టీని స్థాపించి సీపీఎం పార్టీకి కంటగింపుగా మారారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పినరయి విజయన్ అతనిని తిరుగుబాటుదారుడిగా కూడా అభివర్ణించారు.
రెమా ఏప్రిల్ 2021 అసెంబ్లీ ఎన్నికల్లో వడక్కర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి భారీ విజయం సాధించారు. ఇది అధికార సీపీఏంకు పెద్ద షాక్ ఇచ్చినట్లు అయింది. ఇదిలావుంటే ఈ వారం ప్రారంభంలో అసెంబ్లీలో రెమాపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే మణి అనుచిత వ్యాఖ్యలు చేశారు. "ఆమె వితంతువుగా మారడం ఆమె అదృష్టమని, ఇందులో సీపీఐ ఎం లేదా వామపక్షాలకు పాత్ర లేదని" రెమాపై దాడి చేశారు. దీనిపై సభలో నిరసనలు వ్యక్తమయ్యాయి. దాంతో తన వ్యాఖ్యలకు బాధ్యత వహిస్తూ క్షమాపణలు చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa