ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కన్వర్ యాత్రికులపై దూసుకెళ్లిన ట్రక్కు...ఆరుగురి మరణం

national |  Suryaa Desk  | Published : Sat, Jul 23, 2022, 02:23 PM

ఆధ్యాత్మిక యాత్ర ఆ భక్తుల కుటుంభాల్లో తీవ్ర విషాధాన్ని నింపింది. ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో విషాదం చోటుచేసుకుంది. కన్వర్ యాత్రికులపై నుంచి ట్రక్కు దూసుకెళ్లడంతో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. హత్రాస్ ఆగ్రా రోడ్డులోని బదర్ గ్రామంలో ఈ తెల్లవారుజామున 2.15 గంటల ప్రాంతంలో జరిగిందీ ఘటన. బాధితులందరూ మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చెందినవారు. మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించిన పోలీసులు తీవ్రంగా గాయపడిన బాధితుడిని ఆగ్రా మెడికల్ కాలేజీలో చేర్చారు. కన్వర్ యాత్రికులు హరిద్వార్ నుంచి గ్వాలియర్‌కు వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు కారణమైన ట్రక్కు డ్రైవర్‌ను గుర్తించామని, త్వరలోనే అతడిని అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa