ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శివసేనలోని ఇరు పక్షాలకు ఈసీ నోటీసులు

national |  Suryaa Desk  | Published : Sat, Jul 23, 2022, 02:40 PM

శివసేనలోని ఉద్దవ్ థాక్రే...ఏక్ నాథ్ షిండే వర్గాలకు ఈసీ నోటీసులు జారీ చేసింది. 'శివసేనలో చీలిక వచ్చిందనే విషయం స్పష్టంగా అర్థమవుతోంది. ఒక గ్రూపుకు షిండే, మరో గ్రూపుకు థాకరే నాయకత్వం వహిస్తున్నారు. వీరిద్దరూ ఒరిజినల్ శివసేన తమదే అని, తామే శివసేన అధినేతలమని చెపుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు రాతపూర్వకంగా వివరాలు ఇవ్వాలని ఇరు పక్షాలను కోరుతున్నాం. డాక్యుమెంటరీ ఎవిడెన్స్ లు, రాతపూర్వక స్టేట్మెంట్లు అందిన తర్వాత ఇరు పక్షాల వాదనలను వింటాం' అంటూ నోటీసులో ఈసీ పేర్కొంది.  మరోవైపు, శివసేన తరపున గెలిచిన 55 మంది ఎమ్మెల్యేలలో 40 మంది... 18 మంది లోక్ సభ ఎమ్మెల్యేలలో 12 మంది తనతో ఉన్నారని ఈసీకి రాసిన లేఖలో షిండే పేర్కొన్నారు.


ఇదిలవుంటే శివసేన అధినేత ఉద్ధవ్ థాకరేపై తిరుగుబాటు చేసిన ఆ పార్టీ నేత ఏక్ నాథ్ షిండే ఏకంగా ఆ పార్టీని చీల్చేశారు. బీజేపీ అండతో సీఎం పీఠాన్ని అధిరోహించారు. అంతేకాదు, వివిధ మున్సిపల్ కార్పొరేషన్లలోని శివసేన కార్పొరేటర్లను తన గూటికి చేర్చుకుంటున్నారు. దీనికితోడు, శివసేన ఎంపీలు సైతం ఆయనకు టచ్ లో ఉండటం గమనార్హం. 


ఈ క్రమంలో... శివసేన పార్టీ తమదేనని షిండే క్లెయిమ్ చేసుకుంటున్నారు. థాకరే తో ఉన్న ఎమ్మెల్యేల కంటే తన వద్దే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నానని... ఈ నేపథ్యంలో పార్టీ అధినేతగా థాకరేని తొలగించి, తనను నాయకుడిగా గుర్తించాలని ఆయన అంటున్నారు. ఇదే విషయాన్ని ఈసీ దృష్టికి కూడా తీసుకెళ్లారు.  ఈ అంశంపై ఎన్నికల కమిషన్ స్పందించింది. మెజార్టీని నిరూపించుకునేందుకు అవసరమైన డాక్యుమెంట్లను ఆగస్ట్ 8 లోగా తమకు అందజేయాలని ఇరు పక్షాలను ఈసీ కోరింది. డాక్యుమెంట్లు అందిన తర్వాత ఈ అంశంపై విచారణ జరుపుతామని చెప్పారు. ఈసీ సూచనల మేరకు ఇరు పక్షాలు తమ స్టేట్మెంట్లను రాతపూర్వకంగా ఇవ్వాల్సి ఉంటుంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa