బ్రెజిల్ లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. పోలీసులు జరిపిన కాల్పుల్లో దొంగలు మరణించారు. ఈ కాల్పుల్లో దాదాపు 18 మంది మరణించారు. బ్రెజిలియన్ నగరంలో ఇది చోటుచేసుకుంది. రియో డి జెనీరోలోని అల్మావో ఫావెలాస్ వద్ద ఓ క్రైమ్ గ్రూప్ను లక్ష్యంగా చేసుకుని పోలీసులు దాడి చేశారు. ఆ దాడిలో 18 మంది చనిపోయినట్టు పోలీసుల వెల్లడించారు. చనిపోయిన వ్యక్తుల్లో 50 ఏళ్ల మహిళ కూడా ఉంది. ఆమె దాడిలో విచ్చలవిడిగా బుల్లెట్ గాయాలకు గురైందని ఓ పోలీసు అధికారి ఇవాన్ బ్లాజ్ తెలిపారు.
ఈ దాడిలో ఒక పోలీసు అధికారి, ఒక మహిళతో పాటు 16 మంది అనుమానిత నేరస్థులు మరణించారని అధికారులు తెలిపారు. కార్లను దొంగిలించడం, బ్యాంకులను దోచుకోవడం వంటి నేరస్థుల బృందాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగిందని వెల్లడించారు. పోలీసులు జనం ఉన్న నివాస ప్రాంతాల్లో కూడా లక్ష్యాలను కాల్చడానికి హెలికాప్టర్లను ఉపయోగించిన వీడియోలు బయటకొచ్చాయి.
అయితే పోలీసుల చేసిన దాడి పలు విమర్శలపాలవుతుంది. తమకు శాంతి కావాలని, క్షతగాత్రులకు సహాయం చేసేందుకు ప్రయత్నించిన వారిని అరెస్ట్ చేసే ప్రమాదం ఉందని స్థానికులు అంటున్నారు. ఇదొక ఊచకోత అని, దీనిని పోలీసులు ఆపరేషన్ అంటున్నారని ఆరోపణలు చేస్తున్నారు. బాధితులకు సహాయం చేయనివ్వడం లేదని, అలా చేయడానికి ప్రయత్నించినందుకు ఒక వ్యక్తిని అరెస్టు చేయడాన్ని తాను చూశానని స్థానిక మహిళ అన్నారు.
అలాగే 400 మంది అధికారులు పాల్గొన్న ఈ ఆపరేషన్లో పోలీసు అధికారులను చంపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు నిందితులను అరెస్టు చేశారు. ఈ ఆపరేషన్లో నాలుగు హెలికాప్టర్లు, పది సాయుధ వాహనాలతో పాల్గొన్నారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా నుంచి రియో డి జెనీరో నగరంలోకి ప్రవేశించే కార్గో ట్రక్కులను దోచుకునే వరకు క్రిమినల్ వింగ్ విస్తరించిందని ఈ సందర్భంగా పోలీసు అధికారి బ్లజ్ ఈ ప్రాంతంలో పరిస్థితి గురించి వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa