ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీలంక కొత్త అధ్యక్షుడికి మోదీ శుభాకాంక్షలు

national |  Suryaa Desk  | Published : Tue, Jul 26, 2022, 09:04 PM

శ్రీలంక కొత్త అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘేకు భారత ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. గత కొన్ని రోజులుగా తీవ్ర సంక్షోభంతో బాధపడుతున్న శ్రీలంకలో కొత్త మార్పులు తీసుకురావాలని కోరారు. శ్రీలంక ప్రజలకు భారత్ మద్దతు కొనసాగుతుందని ఆయన అన్నారు. శ్రీలంక ఆర్థికంగా పుంజుకోవడానికి తమవంతు సహకారం అందిస్తామని చెప్పారు. దీంతో శ్రీలంక-భారత్ మధ్య ఏళ్లుగా కొనసాగుతున్న మైత్రి బలపడుతుందని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa