ఏడాదికో జాబ్ క్యాలెండర్ అని చెప్పిన జగన్ రెడ్డి నిరుద్యోగ యువతను మోసం చేసాడు అని టీడీపీ నాయకులూ తెలియజేసారు. ప్రభుత్వ చర్యలకి నిరసనగా చదువుకున్న విద్యార్థులు చేస్తున్న ర్యాలీ విషయమై స్పందిస్తూ..... పీజీ, పీహెచ్డీ, బీటెక్ ,ఎంటెక్ చేసిన యువత కూడా ఉద్యోగ అవకాశాలు లేని కారణంగా రిక్షా తొక్కుతూ, ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్న పరిస్థితి జగన్ రెడ్డి పాలనలో ఏర్పడింది. చదువుకున్న యువతను ఇటువంటి పరిస్థితికి దిగజార్చిన జగన్ రెడ్డి పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవి నాయుడు. ఆయన ఆధ్వర్యంలో రిక్షా తొక్కుతూ ఆటో తోలుతూ వినూత్న నిరసన వ్యక్తం చేసారు తెలుగు యువత కార్యకర్తలు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa