బూర్జ మండలం డొంకల పర్త గ్రామ సచివాలయం పరిధిలో రైతు భరోసా కేంద్రం లో రైతులకు ఎరువుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జెడ్ పి టి సి సభ్యులు బెజ్జిపురం రామారావు పాల్గొని ఆయన చేతుల మీదగా ఎరువులు పంపిణీ ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమమును ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. గతంలో ఎన్నడూ ఈ విధంగా రైతు వద్దకే ఎరువులు పంపిణీ కార్యక్రమం జరగలేదని, కేవలం జగనన్న ప్రభుత్వంలో మాత్రమే జరుగుతుందని ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా గత ప్రభుత్వంలో ఎరువులు కోసం విత్తనాల కోసం మండల కేంద్రంలో చుట్టూ తిరగవలసి వచ్చేదని అయినా సరిపడా ఎరువులు దొరికేవి కాదని ఆయన చెప్పడం జరిగింది.
ఈ ప్రభుత్వంలో ప్రతి ఒక్క రైతుకు చాలా మేలు జరుగుతుందని రైతు ఇంటివద్దకే విత్తనాలు కానీ ఎరువులు కానీ అందుతున్నాయని ఆయన చెప్పడం జరిగింది అదేవిధంగా మన ప్రియతమా ముఖ్యమంత్రివర్యులు కు మరియు మన స్థానిక శాసన సభ్యులు శాసనసభాపతి అయినటువంటి తమ్మినేని సీతారాంకి మనం ఎంతో రుణపడి ఉండాలని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ వార్డు సభ్యులు మరియు రైతులు సచివాలయ సిబ్బంది పాల్గొనడం జరిగింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa