కరెంటు సరఫరా చేసే విద్యుత్ శాఖ ఓ ఇంటి యజమానికి షాక్ ఇచ్చింది. మధ్యప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ శాఖ కూడా ఓ కుటుంబానికి అలాగే షాకిచ్చింది. గ్వాలియర్ నగరంలోని శివ్ విహార్ కాలనీలో ఉన్న ఒక ఇంటికి ఏకంగా రూ. 3,419 కోట్ల బిల్లు వచ్చింది. ప్రియాంక గుప్తా పేరిట ఆ ఇల్లు ఉంది. ఈ బిల్లును చూసిన ఆమె మామ (భర్త తండ్రి) షాక్ కు గురై, తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వేల కోట్ల రూపాయల బిల్లును చూసి తన తండ్రి అస్వస్థతకు గురయ్యారని ప్రియాంక గుప్తా భర్త సంజీవ్ కంకనే తెలిపారు. ఈ విషయాన్ని ప్రియాంక, సంజీవ్ లు విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో తప్పును సరిదిద్దుకున్న అధికారులు రూ. 3,419 కోట్ల బిల్లును వెనక్కి తీసుకుని, రూ. 1,300 వాస్తవ బిల్లును అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa