ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఓ‌ విద్యార్థిని ఆత్మహత్య..లెటర్ లో అలా..కుటుంబ సభ్యుల మాట ఇలా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jul 28, 2022, 04:06 PM

ఓ విద్యార్థిని ఆత్మహత్య లెటర్ అందర్నీ కంటతడిపెట్టిస్తుంటే ఆ విద్యార్థి తల్లిదండ్రులు చెప్పిన వివరాలతో గుండె తరుక్కుపోతోంది. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో విషాదం చోటు చేసుకుంది. రైతుపేటలో ప్రభాకర్ కుమార్తె హరిత వర్షిణి ప్రాణాలు తీసుకుంది. బ్యాంకులో రుణం ఉండటంతో.. తల్లిదండ్రులు చదివించే స్థోమత లేదని భావించి ఆత్మహత్య చేసుకుంది. హరిత వర్షిణికి ఇటీవలే ఎంసెట్‌లో 15 వేల ర్యాంకు వచ్చింది. తెలంగాణ ఎంసెట్‌కు కూడా ఆమె ప్రిపేర్ అవుతోంది. ఇంతలో ప్రాణాలు తీసుకోవడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఆమె మరణానికి ముందు ఓ లేఖ కూడా రాసింది.


‘అమ్మా ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం బతకడం కూడా కష్టంగా ఉంది. నా కాలేజీ ఫీజ్, చెల్లి స్కూల్ ఫీజ్ కట్టడానికి కూడా డబ్బులు లేవు. మా వల్లి నీ ఆరోగ్యం పాడుచేసుకోకు, చెల్లిని బాగా చదివించండి, మంచి ఉద్యోగం తెచ్చుకోమను. నేను నీకు భారం అవ్వకూడదని ఇలా చేశాను. ఐ యామ్ సారీ అమ్మ.. నీకు నేను ఏమీ చేయలేకపోతున్నా.. ఏడవకు నా గురించి.. చెల్లి జాగ్రత్త. నాన్న ఎలాగో డబ్బులు పంపిస్తాడో లేదో.. పంపించకపోతే ఇల్లు గడవటం కష్టంగా ఉంటుంది. అందుకేనే నేను ప్రాణాలు తీసుకుంటున్నా. ఎవరన్నా అడిగితే ఎంసెట్ ర్యాంక్ రాలేదని చనిపోయిందని చెప్పు. నీ ఆరోగ్యం జాగ్రత.. చెల్లిని బాగా చదువుకోమని చెప్పు. టైంకి తిని పడుకోండి. మరోసారి సారీ అమ్మా.. నేను ఏమీ చేయలేకపోతున్నాను. నన్ను ఇప్పుడు చదివించే పరిస్థితిలో కూడా లేము. మనం స్కాలర్ షిఫ్ డబ్బులతో చెల్లిని చదివించండి. దానికి బాగా తెలివితేటలు ఉన్నాయి.. మంచి స్టేస్‌కి వెళుతుంది. Bye అమ్మా, చెల్లి, డాడీ కి చెప్పొద్దు ఈ విషయం.. ఏదో ఒకటి చెప్పి మెనేజ్చెయ్.. నాన్నకు నిజం చెప్పొద్దు’అంటూ లేఖ రాసింది.


ఇదిలా ఉంటే హర్షిత కుటుంబ సభ్యుల వాదన మరోలా ఉంది. హర్షిత తండ్రి ప్రభాకర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో లోన్లు తీసుకున్నారు. సుమారు 3 లక్షల రూపాయల వరకు లోన్ తీసుకున్నట్టు సమాచారం. పేద కుటుంబం కావడంతో ఆ లోన్‌ను సకాలంలో తీర్చలేకపోయారు. తమ కుటుంబం చేసిన బ్యాంకు రుణం తీర్చాలంటూ సిబ్బంది కొద్దిరోజులుగా ఒత్తిడి చేస్తున్నారని చెబుతున్నారు. అయితే హర్షిత తండ్రి ఇంట్లో లేని సమయంలో బ్యాంక్ రికవరీ ఏజెంట్లు వచ్చారని.. చదువు మానేసి పశువులు కాచుకోమంటూ తిట్టారని.. మూడు లక్షల అప్పు తిరిగి చెల్లించాలని వేధించారంటున్నారు. ఏజెంట్లు ఇష్టానుసారంగా మాట్లాడటంతో ఆమె మనస్తాపం చెందిందన్నారు. ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతున్నారు. బ్యాంక్ సిబ్బంది వల్లే తన కుమార్తె ప్రాణాలు తీసుకుందని హర్షిత తల్లి అంటున్నారు. కుటుంబ సభ్యులు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఆరోపణలపై బ్యాంక్ సిబ్బంది స్పందించాల్సి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa