ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మీడియాల్లో ప్రకటనల కోసం రూ.3,339.49 కోట్లు ఖర్చు

national |  Suryaa Desk  | Published : Fri, Jul 29, 2022, 08:35 PM

మనదేశంలోని మీడియా కోసం కేంద్ర ప్రభుత్వం ఖర్చుచేసిన మొత్తం ఎంతో తెలుసా...?  కేంద్ర ప్రభుత్వం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రకటనల కోసం గత ఐదేళ్లలో చేసిన ఖర్చు వివరాలను కేంద్రం వెల్లడించింది. సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ రాజ్యసభకు లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. 2017 నుంచి ఇప్పటివరకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాల్లో ప్రకటనల కోసం రూ.3,339.49 కోట్లు ఖర్చు చేసినట్లు ఆయన వివరించారు. ప్రింట్ మీడియాకు రూ.1756.48 కోట్లు, ఎలక్ట్రానిక్ మీడియాకు రూ.1,583.01 కోట్లు ప్రకటనల రూపంలో ఇచ్చినట్లు తెలిపారు. ఈ మొత్తాన్ని సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ద్వారా కేంద్రం ఖర్చు చేసిందని రాజ్యసభలో ఆయన వివరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa