కాంగ్రెస్ పార్టీ ఎంపీ అధీర్ రంజన్ చౌదరీకి జాతీయ మహిళా కమిషన్ చీఫ్ రేఖ శర్మ నోటీసులు జారీ చేశారు. తమ ముందు వ్యక్తిగతంగా హాజరు కావాలని.. వ్యాఖ్యలపై లిఖిత పూర్వకంగా వివరణ ఇవ్వాలంటూ నోటీసుల్లో స్పష్టంగా పేర్కొంది. ఆగస్టు 3వ తేదీ ఉదయం 11:30 గంటలకు విచారణ ఉంటుందని లేఖలో తెలిపింది. అదేవిధంగా.. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి కూడా జాతీయ మహిళా కమిషనర్ లేఖ రాసింది. సోనియా గాంధీ ఈ వివాదంలో జోక్యం చేసుకుని.. అనుచిత వ్యాఖ్యలు చేసిన అధిర్ రంజన్పై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మీద కాంగ్రెస్ పార్టీ ఎంపీ అధీర్ రంజన్ చౌదరీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్నే రేపుతున్నాయి. ఈ వివాదంపై పార్లమెంట్ ఉభయ సభల్లో కాంగ్రెస్ పార్టీపై బీజేపీ ఎంపీలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ వ్యవహారంపై మహిళా కమిషన్ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రపతిపై రంజన్ చౌదరి చేసిన వ్యాఖ్యలపై సోనియా గాంధీ లిఖిత పూర్వకంగా క్షమాపణలు చెప్తూ.. ఎంపీపై చర్యలు తీసుకోవాలంటూ మహిళా కమిషన్ లేఖ రాసింది.
ఈ వ్యవహారంపై రేఖ శర్మ స్పందిస్తూ.. అధిర్ రంజన్ సెక్సీయెస్ట్ కామెంట్స్ చేశారని.. అవన్నీ దిగజారిన వ్యాఖ్యలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రపతిని రాష్ట్రపత్ని అని సంబోధించడం ఆయన మైండ్సెట్ను ప్రతిబింబిస్తున్నాయని ఆమె వ్యాఖ్యానించారు. అధిక్ రంజన్ రాత పూర్వకంగా క్షమాపణలు చెప్పాలని.. పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కూడా ఆయనపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa