ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రజలు తమ ఇళ్లలోకి వెళ్లేవరకు ప్రభుత్వం చేయూత ఇవ్వాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jul 30, 2022, 12:30 PM

గోదావరి వరదల్లో పూర్తిగా నేలమట్టమైపోయిన తమ ఇళ్లను చూసుకుని కన్నీరు మున్నీరవుతున్న నిరుపేదల ఆవేదన వర్ణనాతీతం. సర్వస్వమూ తుడిచిపెట్టుకుపోగా నిలువ నీడ లేని పరిస్థితుల్లో... జీవితాన్ని మళ్ళీ మొదటి నుంచీ ప్రారంభించాలంటే ఆ పేద కుటుంబాలకు ఇది ఎంత పెద్ద కష్టమో ఆలోచించండి అని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తపరిచారు. 


వరద ప్రాంతాలలో పర్యటిస్తున్న ఆయన మాట్లాడుతూ... ఎటపాక, కూనవరం మండలాల్లోని అనేక గ్రామాల్లో ఇదే పరిస్థితి. ఇలాంటి కష్ట సమయంలో బాధితులకు రూ.2,000ల కంటితుడుపు సాయం చేస్తామంటున్న సీఎంను ఏమనాలి? ప్రజల కష్టాలు అర్థం చేసుకోడానికి మానవత్వం ఉండాలి. 


ప్రభుత్వ పెద్దలకు హృదయం లేకపోతే ప్రజలు ఎన్ని కష్టాలు పడతారో చెప్పడానికి ఇది నిదర్శనం. ఈ దృశ్యాలను చూసైనా జగన్ రెడ్డి మనసు మార్చుకుని పునరావాస కేంద్రాలు మరిన్ని రోజులు కొనసాగించాలి. ప్రజలు తమ ఇళ్లలోకి వెళ్లేవరకు ప్రభుత్వం చేయూత ఇవ్వాలి. తక్షణ సాయంగా బాధిత కుటుంబాలకు10 వేల రూపాయలు ఇవ్వాలి అని డిమాండ్ చేసారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa