ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చంద్రబాబు వరద బురదలో రాజకీయాలు చేస్తున్నాడు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jul 30, 2022, 12:41 PM

చంద్రబాబు గోదావరి ముంపు ప్రాంతమైన ఎటపాక మండలంలో పర్యటిస్తూ, వరద బాధితులను ఓదార్చడం సంగతి దేవుడెరుగు. వరద బురదలో రాజకీయాలు చేస్తున్నారు అని వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ....  చిత్తశుద్థితో ఒక్క మాట కూడా సానుభూతిగా మాట్లాడడం లేదు. అది ఆయన దిగజారిన రాజకీయానికి అద్దం పడుతోంది.


పోలవరం ముంపు ప్రాంతాలు.. చింతూరు, ఎటపాక, వీఆర్‌పురం, అటువైపు ఉన్న నాలుగు మండలాలు.. ఇటు ఏలూరు జిల్లాలో ఉన్న రెండు మండలాలు కుక్కునూరు, వేలేరుపాడు కలిపి ఒక జిల్లా చేస్తానంటున్నాడు. అంటే 2024లో ఆయన సీఎం అయితే, ఆ జిల్లా ఏర్పాటు చేస్తాడట.


ఎటపాక నుంచి ఇవాళ జిల్లా కేంద్రం అయిన పాడేరు వెళ్లాలంటే 385 కి.మీ అవుతుంది కాబట్టి, హైదరాబాద్‌కు సులభంగా పోవచ్చు. కాబట్టి తాను సీఎం కాగానే పోలవరం జిల్లా చేస్తానంటున్నాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa