ఈనెల 9వ తేదీ నుంచి దాదాపు 21వ తేదీ వరకు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో వరద పరిస్థితి మనమంతా చూశాం. గోదావరి చరిత్రలో గతంలో ఏనాడూ లేని విధంగా జూలై నెలలో భారీ వరదలు వచ్చాయి అని మంత్రి గుడివాడ అమర్నాధ్ తెలిపారు.వరదల అంశంపై మాట్లాడుతూ.... 1986 తర్వాత ఆ స్థాయిలో దాదాపు 71 అడుగుల స్థాయిలో గోదావరికి వరదలు వచ్చాయి. అయినా ప్రభుత్వం సమర్థంగా పని చేసింది. దాదాపు లక్ష కుటుంబాలను ఆదుకోవడం జరిగింది.
ప్రతి కుటుంబానికి నిత్యావసరాలతో పాటు, తక్షణ సహాయంగా రూ.2 వేలు వెంటనే ఇచ్చాం. అలా గతంలో ఎక్కడా అలా ఇవ్వలేదు. ఇటీవల సీఎం పర్యటించి, అన్నీ స్వయంగా వివరాలు ఆరా తీశారు. ఎక్కడా, ఎవరూ తమకు సహాయం అందలేదని చెప్పలేదు.
దాదాపు లక్ష కుటుంబాలు.. పశ్చిమ గోదావరిలో 10 వేల కుటుంబాలు, ఏలూరు జిల్లాలో 21,500 కుటుంబాలు, కోనసీమ జిల్లాలో 35 వేల కుటుంబాలు, అల్లూరి సీతారామరాజు జిల్లాలో దాదాపు 42 వేల కుటుంబాలు.. ఇంకా తూర్పు గోదావరి జిల్లా నుంచి దాదాపు 1500 కుటుంబాలకు.. అలా మొత్తం లక్ష కుటుంబాలకు తక్షణ సహాయంగా రూ.2 వేలతో పాటు, 25 కేజీల బియ్యం, నూనె, పప్పు, ఉల్లిపాయలు, బంగాళదుంపలు ఇవ్వడం జరిగింది అని తెలియజెయ్యడం జరిగింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa